యాప్నగరం

‘ఎర్రిపప్పా అంటే బుజ్జినాన్న’ అని అర్థం.. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వివరణ

Karumuri Nageswara Rao Comments on Farmer ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కామెంట్స్‌పై దుమారం రేగింది. రైతుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎర్రి పప్పు అంటూ ఉపయోగించిన పదంపై వివాదం మొదలైంది. సోషల్ మీడియాలో మంత్రి వీడియో వైరల్ అయ్యింది. దీంతో నాగేశ్వరరావు స్పందించారు. తాను ఉపయోగించిన ఎర్రి పప్ప పదంపై వివరణ ఇచ్చారు. తాము వాడుక భాషగా ఈ పదాన్ని ఉపయోగిస్తామని చెప్పుకొచ్చారు మంత్రి కారుమూరి.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 9 May 2023, 12:43 pm

ప్రధానాంశాలు:

  • ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కామెంట్స్
  • మంత్రి ఉపయోగించిన పదంపై వివాదంరేగింది
  • తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి కారుమూరి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Karumuri Nageswara Rao Comments
ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (Karumuri Nageswara Rao) ఉపయోగించిన ఓ పదంపై ఇప్పుడు దుమారం రేగింది. మంత్రి తీరుపై విమర్శలు రావడంతో స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఆ రోజు ఏం జరిగిందో చెప్పారు.. తాను ఉయోగించిన పదానికి అర్థం వేరు అన్నారు. ఈ నెల 6న తణుకు మండలం వేల్పూరులో మంత్రి కారుమూరి పర్యటించారు. అకాల వర్షాల వల్ల ధాన్యం మొలకొచ్చిదని ఓ రైతు తన గోడును వెళ్లబోసుకున్నారు. మంత్రి స్పందించి.. రైతును ఉద్దేశించి ‘ఎర్రిపప్పా.. మొలకలొస్తే నేనేం చేస్తా’ అంటూ కాస్త ఘాటుగా మాట్లాడారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో వివాదం రేగింది. రైతు విషయంలో మంత్రి వ్యవహారించిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో మంత్రి ఈ ఎపిసోడ్‌పై స్పందించారు. తాను రైతులతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి బాగా తాగొచ్చారని.. తన ధాన్యానికి మొలకొచ్చిందని పదే పదే చెప్పారన్నారు. ఏ గింజైనా కొంటామని తాను సమాధానం చెప్పానని.. మరి అగ్రిగోల్డ్‌ సంగతి ఏంటి అని ప్రశ్నించారన్నారు.

అందుకే తాను ఎర్రిపప్పా అని అన్నానని.. ఎర్రిపప్పా అంటే బుజ్జినాన్న అన్నట్లు.. ఇది తమ వాడుక భాషగా చెప్పారు మంత్రి. ఎర్రిపప్పా.. ఎర్రినాన్న అని అంటారని కారుమూరి అన్నారు. ఈ వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి. అటు టీడీపీ కూడా మంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతుపై పరుష పదజాలం ఉపయోగించి.. మళ్లీ సమర్థించుకునే ప్రయత్నం చేయడం దారుణమన్నారు ఆ పార్టీ నేతలు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఈ ఎపిసోడ్‌పై స్పందించారు. 'గౌర‌వ‌నీయులైన మంత్రివ‌ర్యులు ఎర్రిప‌ప్ప కారుమూరి నాగేశ్వ‌ర‌రావు గారు ధాన్యం ఎప్పుడు కొంటారు సారు!.. (పీఎస్: ఎర్రిప‌ప్ప అంటే బుజ్జి నాన్న అన్న‌ట్టు అర్థమ‌ని మంత్రి గారే సెల‌విచ్చారు)' అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు.
మరోవైపు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మరోసారి అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించేందుకు ఏలూరు జిల్లా వెళ్లారు. అక్కడ ఉంగుటూరు, నాచుగుంటలో పర్యటించిన సమయంలో.. రైతులు తమ సమస్యలను చెప్పుకున్నారు. ఈ క్రమంలో మంత్రి అసహనంతో ఓ రైతును 'ఏయ్‌..నోరు మూసుకో' అంటూ మండిపడ్డారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నాచుగుంటలో పర్యటించారు. మంత్రి సోమవారం అక్కడ పర్యటించారు. మొత్తానికి మంత్రి ఉపయోగించిన ఆ పదంపై ఇప్పుడు సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.