యాప్నగరం

Amaravathiలో శాసన రాజధాని కూడా వద్దు.. జగన్‌ను కలిసి చెప్పా: ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

పేద ప్రజలు ఉండేందుకు వీల్లేని అమరావతిలో రాజధాని కూడా ఉండేందుకు వీల్లేదని ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి చెప్పాను అన్నారు. దీనిపై అన్ని పక్షాలతో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పారు.

Samayam Telugu 8 Sep 2020, 6:19 am
అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దంటున్నారు ఏపీ మంత్రి కొడాలి నాని. పేద ప్రజలు ఉండేందుకు వీల్లేని అమరావతిలో రాజధాని కూడా ఉండేందుకు వీల్లేదని ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి చెప్పాను అన్నారు. దీనిపై అన్ని పక్షాలతో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో 55 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దానిపై కోర్టుకు వెళ్లి స్టే తీసుకురావడం విడ్డూరంగా ఉందన్నారు.
Samayam Telugu అమరావతి


ఉచిత విద్యుత్తు సంస్కరణల్లో భాగంగా రూ.30 వేల కోట్లతో ప్రభుత్వం ఏపీ గ్రీన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయబోతోందన్నారు. దీన్ని ఏ రైతూ వ్యతిరేకించకున్నా టీడీపీ రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబుకు ప్రజల్లో బలంలేదని.. ఎమ్మెల్యేలు లేరు.. ఉన్నవాళ్లు వెళ్లిపోతున్నారన్నారు. కుమారుడు లోకేష్‌ను ఎమ్మెల్యేను చేయడం ఎవరి వల్లా కాదని సెటైర్లు పేల్చారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్‌ వెంటే నడుస్తానని.. కొన్ని దుష్ట శక్తులను నిర్వీర్యం చేస్తానని మంత్రి నాని అన్నారు. అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.