యాప్నగరం

TDP: శివ ప్రసాద్ మరణం.. మంత్రి పెద్దిరెడ్డి భావోద్వేగం

SivaPrasad మరణం పట్ల మంత్రి పెద్దిరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. అన్నయ్యా అని పిలిచే వ్యక్తిని కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శివప్రసాద్ కుటుంబీకులకు ఆయన సానుభూతి వ్యక్తం చేశారు.

Samayam Telugu 22 Sep 2019, 10:20 am
టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ పార్థివ దేహానికి చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాళులు అర్పించారు. శివ ప్రసాద్ కుటుంబీకులను ఆయన ఓదార్చారు. ఈ సందర్భంగా శివప్రసాద్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో మంత్రి భావోద్వేగానికి లోనయ్యారు. రాజకీయాలకు అతీతంగా తమ ఇద్దరి మధ్య అవినాభావ సంబంధం ఉందని మంత్రి తెలిపారు. శివ ప్రసాద్ విలక్షణమైన వ్యక్తి అన్న పెద్దిరెడ్డి.. ఆయనకు రాజకీయాలతో అతీతంగా అభిమానులు ఉన్నారన్నారు.
Samayam Telugu siva peddireddy


శివ ప్రసాద్ అకాల మరణం జిల్లాకు తీరని లోటని పెద్దిరెడ్డి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థించారు. అన్నయ్య అని ప్రేమతో పిలిచే నేతను కోల్పోయామని పెద్దిరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.

కిడ్నీ సంబంధిత వ్యాధితో చెన్నై హాస్పిటల్‌లో చికిత్స పొందిన శివ ప్రసాద్.. శనివారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన పార్థీవ దేహానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తన స్కూల్ మేట్ అయిన శివప్రసాద్‌ భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబు తిరుపతి రానున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.