ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులకు జూన్ నెలలో ప్రోబెషన్ను అమలు చేస్తామన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారని గుర్తు చేశారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. సచివాలయాల్లో ఉద్యోగులు బాగా పనిచేస్తున్నారని.. వారి పనితీరును గమనించి వారికి జూన్ నెలలో ప్రోబెషన్ డిక్లేర్ చేస్తామని గతంలోనే ప్రకటించామని గుర్తు చేశారు. సచివాలయ ఉద్యోగుల ప్రోబేషన్పై అంశాన్ని తెలుగుదేశం పార్టీ కావాలనే రాజకీయం చేస్తోందని మంత్రి మండిపడ్డారు. ఈ మధ్య కొంతమంది కార్యదర్శులను, సచివాలయ ఉద్యోగులను రెచ్చగొట్టారని.. వారికి ప్రోబెషన్ ఇవ్వడం లేదని, జీతాలు పెంచడం లేదంటూ కొందరు నిరసనలు కూడా తెలిపారనన్నారు. ఇదే క్రమంలో సీఎంజగన్ ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రోబెషన్పై స్పష్టమైన ప్రకటన చేశారన్నారు. సచివాలయ ఉద్యోగుల గురించి తమకే బాధ్యత ఉన్నట్లుగా.. తమ హయాంలో ఉద్యోగాలు ఇచ్చినట్లు టీడీపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు.
జూన్ తరువాత యథాప్రకారం నిబంధనల మేరకు సచివాలయ ఉద్యోగులకు జీతాలు వస్తాయని పెద్దిరెడ్డి చెప్పారు. సీఎం జగన్ కారణంగానే సచివాలయ ఉద్యోగాలు వచ్చాయని.. వారి పట్ల ఈ ప్రభుత్వం బాధ్యతగా ఉందన్నారు. దీనిపై తెలుగుదేశం అతిగా స్పందించాల్సిన అవసరం లేదని హితవు పలికారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ముందుచూపుతో సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా ఏకకాలంలో నాలుగు లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించిన ఘనత దక్కుతుందన్నారు.
సచివాయాల ద్వారా ప్రజలకు పారదర్శకమైన పాలనను అందిస్తున్నామన్నారు మంత్రి. పంచాయతీరాజ్లో సీఎం అనేక సంస్కరణలను తీసుకువచ్చారన్నారు. గతంలో పంచాయతీ కార్యదర్శలు గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ 4 వరకు ఉండేవారని తెలిపారు. అయితే సీఎం సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన తరువాత గ్రేడ్ 5 కింద రెండు విడతల్లో మొత్తం 7040 పోస్టులకు గానూ 6778 పోస్ట్లను భర్తీ చేశామని తెలిపారు. అలాగే గ్రేడ్ 6 కింద 11,150 డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్ లకు గానూ 9376 పోస్ట్ లు భర్తీ చేశామన్నారు. సర్వీస్ కమీషన్కు ఇవ్వకుండా పంచాయతీరాజ్ శాఖ ద్వారానే రెండు విడతల్లో ఈ పోస్ట్ లను అత్యంత పారదర్శకంగా భర్తీ చేశామన్నారు. సచివాలయాల ఉద్యోగులకు జూన్లో ప్రోబేషన్ ప్రకటిస్తామని జగన్ సర్కార్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.. అసెంబ్లీలో మరోసారి మంత్రి రామచంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు.
జూన్ తరువాత యథాప్రకారం నిబంధనల మేరకు సచివాలయ ఉద్యోగులకు జీతాలు వస్తాయని పెద్దిరెడ్డి చెప్పారు. సీఎం జగన్ కారణంగానే సచివాలయ ఉద్యోగాలు వచ్చాయని.. వారి పట్ల ఈ ప్రభుత్వం బాధ్యతగా ఉందన్నారు. దీనిపై తెలుగుదేశం అతిగా స్పందించాల్సిన అవసరం లేదని హితవు పలికారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ముందుచూపుతో సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా ఏకకాలంలో నాలుగు లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించిన ఘనత దక్కుతుందన్నారు.
సచివాయాల ద్వారా ప్రజలకు పారదర్శకమైన పాలనను అందిస్తున్నామన్నారు మంత్రి. పంచాయతీరాజ్లో సీఎం అనేక సంస్కరణలను తీసుకువచ్చారన్నారు. గతంలో పంచాయతీ కార్యదర్శలు గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ 4 వరకు ఉండేవారని తెలిపారు. అయితే సీఎం సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన తరువాత గ్రేడ్ 5 కింద రెండు విడతల్లో మొత్తం 7040 పోస్టులకు గానూ 6778 పోస్ట్లను భర్తీ చేశామని తెలిపారు. అలాగే గ్రేడ్ 6 కింద 11,150 డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్ లకు గానూ 9376 పోస్ట్ లు భర్తీ చేశామన్నారు. సర్వీస్ కమీషన్కు ఇవ్వకుండా పంచాయతీరాజ్ శాఖ ద్వారానే రెండు విడతల్లో ఈ పోస్ట్ లను అత్యంత పారదర్శకంగా భర్తీ చేశామన్నారు. సచివాలయాల ఉద్యోగులకు జూన్లో ప్రోబేషన్ ప్రకటిస్తామని జగన్ సర్కార్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.. అసెంబ్లీలో మరోసారి మంత్రి రామచంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు.