యాప్నగరం

Jana Sena: జనసేన కార్యకర్త పాడె మోసిన ఏపీ మంత్రి

జనసేన కార్యకర్త మరణించగా ఆయన పాడెను మంత్రి పేర్ని నాని మోశారు. అలాగే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సైతం ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Samayam Telugu 3 Feb 2020, 5:43 pm
రాష్ట్ర మంత్రి పేర్ని నాని మరోసారి వార్తల్లో నిలిచారు. జనసేన కార్యకర్త, కృష్ణా జిల్లా మచిలీపట్నం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి లక్ష్మణరావు గుండెపోటుతో కన్నుమూయగా.. అంత్యక్రియల్లో ఆయన పాడె మోశారు. దాసరి లక్ష్మణరావు ప్రాణ స్నేహితుడు సుధాకర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. స్నేహితుడి మరణం లక్ష్మణరావును కుంగదీసిందని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Samayam Telugu pjimage (21)


మచిలీపట్నంలో సుధా స్టూడియోస్ నిర్వహించే సుధాకర్, దాసరి లక్షణరావు చాలా సంవత్సరాలుగా స్నేహితులు. సుధాకర్ చనిపోయిన తర్వాత కొన్ని రోజులుగా లక్ష్మణరావు ముభావంగా ఉంటూ వచ్చాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉన్నట్లుండి హార్ట్ ఎటాక్ వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్పారు. లక్ష్మణరావును వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందించినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఈయన మరణంపై పలువురు సంతాపం వ్యక్తం చేసారు.

లక్ష్మణరావు మృతితో మచిలీపట్నంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరితో కలివిడిగా ఉండే లక్ష్మణరావు మరణం.. పార్టీలకు అతీతంగా అందరినీ కలిచివేసింది. ఆయన అంతిమయాత్రలో ఏపీ మంత్రి పేర్ని నానితో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. అలాగే వీరిద్దరూ లక్ష్మణరావు పాడె మోశారు. జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు లక్ష్మణరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.