యాప్నగరం

ఏపీ మంత్రి పేషీలో ఫోర్జరీ కలకం.. నకిలీ పత్రాలతో ఉద్యోగం కోసం ప్రయత్నం

ఏపీ మంత్రి నాని పేషీలో అటెండర్ పేరు చెప్పి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. అతడి నుంచి రూ.3 లక్షల 40వేలు వసూలు చేశారు. ఎన్ని రోజులైనా ఉద్యోగం రాకపోవడంతో అతడు ఆ నకిలీ పత్రంతో సంబంధిత శాఖ అధికారుల్ని కలిశాడు.

Samayam Telugu 29 Sep 2020, 11:51 am
ఏపీ మంత్రి కొడాలి నాని పేషీలో ఫోర్జరీ పత్రాల వ్యవహారం కలకలంరేపింది. నకిలీ పత్రాలతో ఉద్యోగం కోసం ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. గుంటూరు జిల్లా నల్ల చెరువుకు చెందిన యాగయ్యకు కొంతమంది తెలిసిన వ్యక్తులు, ఏపీ మంత్రి నాని పేషీలో అటెండర్ పేరు చెప్పి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. అతడి నుంచి రూ.3 లక్షల 40వేలు వసూలు చేశారు. ఆ తర్వాత సతీష్ వర్మ ఉద్యోగం ఇవ్వాలని పౌరసరఫరాలశాఖకు నకిలీ పత్రాలు పంపారు. ఆ పత్రాన్ని యాగయ్యకు కూడా ఇచ్చారు.. ఎన్ని రోజులైనా ఉద్యోగం రాకపోవడంతో అతడు ఆ నకిలీ పత్రంతో సంబంధిత శాఖ అధికారుల్ని కలిశాడు.
Samayam Telugu ఏపీ సచివాలయం


ఆ లెటర్ చూసిన సంబంధితశాఖ అధికారులు అవాక్కయ్యారు. వెంటనే ఈ పత్రాలపై ఆరా తీయడంతో మోసం బయటపడింది. దీంతో బాధితుడు తుళ్లూరు పోలీసులకు, సతీష్ వర్మతో పాటూ మరో ఐదుగురిపైనా ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ ఫోర్జరీ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.