యాప్నగరం

AP Volunteers Salary: వాలంటీర్లకు ఏపీ మంత్రి గుడ్‌న్యూస్.. జీతం పెంపుపై కీలక ప్రకటన

Ap Volunteers Salary పెంపుపై మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు కష్టపడి పనిచేసి రాష్ట్రంలో మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చేలా కృషిచేయాలని వ్యాఖ్యానించారు. మరో పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను ఉద్యోగాల నుంచి తొలగించడం ఖాయమని హెచ్చరించారు. పేదరికమే ప్రామాణికంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పింఛను అందిస్తోంది అన్నారు మంత్రి. పింఛన్లు తొలగింపు అనేది దుష్ప్రచారమేనని.. అందులో వాస్తవం లేదన్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచుతూ వస్తున్నారన్నారు

Authored byతిరుమల బాబు | Samayam Telugu 5 Jan 2023, 6:56 am

ప్రధానాంశాలు:

  • ఏపీ మంత్రి విశ్వరూప్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • గ్రామ, వార్డు వాలంటీర్లకు శుభవార్త చెప్పారు
  • మరో పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలుండవ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Pinipe Viswarup
Ap Volunteers Salary Hike: ఏపీలో వాలంటీర్లకు శుభవార్త చెప్పారు ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి రాగానే గ్రామ వాలంటీర్లకు రూ.15వేల వేతనం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారన్నారు. డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరంలో గ్రామ వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. కష్టపడి పనిచేసి రాష్ట్రంలో మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చేలా కృషిచేయాలని సూచించారు. మరో పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను ఉద్యోగాల నుంచి తొలగించడం ఖాయమని హెచ్చరించారు.
సంక్షేమ ఫలాలు పొందని లబ్ధిదారులను ఆరు నెలలకు ఒకసారి గుర్తిస్తూ.. వారికి పథకాలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుతోందన్నారు మంత్రి విశ్వరూప్. నియోజకవర్గ పరిధిలో 1200 మందికి నూతనంగా పింఛన్లు మంజూరు చేశామని తెలిపారు. పేదరికమే ప్రామాణికంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పింఛను ఇస్తోందని గుర్తు చేశారు. పింఛన్లు తొలగింపు అనేది దుష్ప్రచారమేనని.. ఎవరూ నమ్మొద్దన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచుతూ వస్తున్నారన్నారు.

2019లో 39 లక్షలు ఉన్న పింఛన్లను ప్రస్తుతం 64 లక్షలకు పెంచారన్నారు మంత్రి. ఇంటి పన్ను అధికంగా రావడంతో పింఛను ఇవ్వలేదని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిని కలిసి తన గోడు చెప్పుకొందామని వచ్చానని.. వర్షం పడుతుండడంతో వేదిక వద్దకు వెళ్లలేకపోయాను అన్నారు. తన పేరుమీద ఉన్న పన్ను మార్పించి పింఛను ఇప్పించాలని ఆయన కోరారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.