యాప్నగరం

ఏపీ: ఎక్కడైనా కోళ్లు మరణిస్తే ఇలా చేయండి.. ప్రజలకు సర్కార్ అలర్ట్

బర్డ్‌ ఫ్లూ వ్యాధి పక్షి నుంచి మనుషులకు సోకే అవకాశం చాలా తక్కువని.. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని, కోడి గుడ్లు, కోడి మాంసంను నిరభ్యంతరంగా తినొచ్చన్నారు.

Samayam Telugu 18 Jan 2021, 6:26 am
దేశవ్యాప్తంగా బర్డ్‌ ఫ్లూతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కోళ్ల మరణాలపై అప్రమత్తంగా ఉండాలని పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సూచించారు. కోళ్లలో మరణాలు గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.. వ్యాధి నిర్ధారణ చేసుకోవాలన్నారు. బర్డ్‌ ఫ్లూ వ్యాధి పక్షి నుంచి మనుషులకు సోకే అవకాశం చాలా తక్కువని.. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని, కోడి గుడ్లు, కోడి మాంసంను నిరభ్యంతరంగా తినొచ్చన్నారు. దేశంలో 11 రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాధి నిర్ధారణ అయ్యిందని.. ప్రజలు వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తిచేశారు.
Samayam Telugu ఏపీ ప్రజలకు అలర్ట్


దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. కోళ్లు, కాకులు, పక్షులు ఉన్నట్టుండి చనిపోతున్నాయి. దీంతో కేంద్ర అప్రమత్తం అయ్యింది.. రాష్ట్రాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ఏపీలో కూడా అధికారులు రంగంలోకి దిగారు.. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాల్లో ఎక్కడైనా కోళ్లు, పక్షులు చనిపోతే వివరాలు తెలుసుకుని.. శాంపిల్స్ సేకరిస్తున్నారు. బర్డ్ ఫ్లూపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.