యాప్నగరం

ఏపీ మంత్రి కాన్వాయ్‌లో కారు ఢీకొట్టి‌ వ్యక్తి మృతి.. మంత్రికి గాయాలు

ఏపీ మంత్రి కాన్వాయ్ ఢీకొట్టడంతో వృద్ధుడికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంలో మంత్రికి కూడా స్వల్ప గాయాలు. భీమడోలు సమీపంలో ఘటన.

Samayam Telugu 15 Jan 2020, 4:01 pm
ఏపీ మంత్రి తానేటి వనిత కాన్వాయ్‌‌లో వాహనం ఢీకొట్టి ఓ వ్యక్తి చనిపోయాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు సమీపంలో ఘటన జరిగింది. కనకదుర్గమ్మ ఆలయం దగ్గర ఓ వృద్ధుడు బైక్‌పై వెళుతుండగా.. మంత్రి కాన్వాయ్‌లోని ఓ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఆ వ్యక్తి బైక్ అదుపు తప్పగా.. వాహనం వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టింది.
Samayam Telugu elr


Read Also: పొలిటికల్ జంక్షన్‌లో వంగవీటి రాధా.. రూట్ మారుస్తారా!

ఈ ప్రమాదంలో మంత్రి వనిత స్వల్ప గాయాలయ్యాయి. బైక్‌పై ఉన్న వృద్ధుడుకి తీవ్ర గాయాలు అయ్యాయి. అతడ్ని హుటా హుటిన ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్సపొందుతూ చనిపోయాడు. మృతుడు భీమవరంకు చెందిన కలసూరి వెంకటరామయ్యగా గుర్తించగా.. పండుగరోజు ప్రమాదం జరగడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంత్రికి స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి వెళ్లారు.. అక్కడ డాక్టర్లు చికిత్స అందించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారాణాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.