యాప్నగరం

మానవత్వం చాటుకున్న మహిళా మంత్రులు.. రోడ్డుపై పడున్న వ్యక్తిని..!

ఏపీ మహిళా మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడారు.

Samayam Telugu 5 Nov 2020, 11:03 pm
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి దీనంగా పడి ఉన్న వ్యక్తిని రాష్ట్ర మహిళా మంత్రులు కాపాడి మానవత్వం చాటుకున్నారు. రాజధాని అమరావతి ప్రాంతం దొండపాడుకు చెందిన నరసింహారావు గురువారం కరకట్ట రోడ్డుపై వెళుతున్న సమయంలో ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరసింహారావుకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న హోంమంత్రి సుచరిత కరకట్టపై గాయాలతో పడిఉన్న నరసింహారావును చూశారు.
Samayam Telugu వ్యక్తిని కాపాడిన మంత్రులు


వెంటనే వాహనాన్ని ఆపి తనతో పాటు ఉన్న రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితతో కలిసి నరసింహారావును తమ కాన్వాయ్‌లో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నరసింహారావు పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తక్షణ సహాయం అందించి తన ప్రాణాలను కాపాడినందుకు మంత్రులు సుచరిత, తానేటి వనితకు నరసింహారావు కృతజ్ఞతలు తెలిపాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.