విజయవాడ: గోడెక్కిన ఏపీ మంత్రులు
కృష్ణా వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న ఏపీ మంత్రులు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల పర్యటన. వరద బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై ఆరా.
Samayam Telugu 17 Aug 2019, 11:25 am
ఎగువన కురిసిన వర్షాలు, వరదలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వైపు పరుగులు తీస్తోంది. ముఖ్యంగా కృష్ణాజిల్లాను ఈ వరద వణికిస్తోంది. నది పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నీ వరద గుప్పిట్లో ఉన్నాయి.. రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడలోని చాలా ప్రాంతాలో వరద ముంపులో ఉన్నాయి. ఏపీ మంత్రులు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
మంత్రులు అనిల్ కుమార్ ,పేర్నినాని, కొడాలినాని, వెల్లంపల్లి శ్రీనివాస్లు కృష్ణలంక ముంపు ప్రాంతాలను పరిశీలించారు.
బాలాజీ నగర్, గీతానగర్, తారకరామానగర్ లోని వరద బాదితులను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇటు మంత్రులు కొడాలినాని, అనిల్ప్రమాదకర రిటర్నింగ్ వాల్ ఎక్కి వరద స్దాయిని పరిశీలించారు.
ఇటు పామర్రు నియోజకవర్గంలో 9లంక గ్రామాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఆ గ్రామాల్లో ఉన్న 4000 మందిని పునారావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరద పెరిగే అవకాశం ఉండడంతో చర్యలను మరింత వేగవంతం చేయాలని మంత్రి అనిల్ ఆదేశించారు. వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 10 బోట్లకు పైగా సిద్ధం చేశారు.
మంత్రులు అనిల్ కుమార్ ,పేర్నినాని, కొడాలినాని, వెల్లంపల్లి శ్రీనివాస్లు కృష్ణలంక ముంపు ప్రాంతాలను పరిశీలించారు.
బాలాజీ నగర్, గీతానగర్, తారకరామానగర్ లోని వరద బాదితులను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇటు మంత్రులు కొడాలినాని, అనిల్ప్రమాదకర రిటర్నింగ్ వాల్ ఎక్కి వరద స్దాయిని పరిశీలించారు.