యాప్నగరం

ఎస్ఈసీ కనగరాజ్‌తో ఉన్నతాధికారుల భేటీ.. స్థానిక ఎన్నికలపై కీలక చర్చలు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కనగరాజ్‌తో మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల పరిస్థితిపై నివేదించారు.

Samayam Telugu 11 Apr 2020, 8:53 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్‌ కనగరాజ్‌తో శనివారం మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల యథాతథ స్థితిపై ఎస్‌ఈసీకి నివేదించారు. నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రస్తుత స్థితి గురించి ఆయన వివరించారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలు మార్చుతూ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి నుంచి దిగిపోయేలా జగన్ సర్కార్‌ ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయమే కనగరాజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. దీంతో కనగరాజు ఆధ్వర్యంలోనే త్వరలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి.
Samayam Telugu pjimage - 2020-04-11T205144.382

ఎస్‌ఈసీని మర్యాదపూర్వకంగా కలిసిన డీజీపీ
అలాగే రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్‌ కనగరాజ్‌ను డీజీపీ గౌతమ్ గౌతం సవాంగ్‌ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్‌ఈసీతో సుమారు అర గంట పాటు భేటీ అయిన డీజీపీ.. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను వివరించారు.

కాగా, ఎస్‌ఈసీ కనగరాజ్‌ను వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.