యాప్నగరం

AP NGO: రేపు విద్రోహ దినం.. కలెక్టరేట్ల వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన

AP NGO: ఏపీఎన్జీవో సెప్టెంబర్ 1న విద్రోహ దినంగా పాటిస్తామని ప్రకటించింది. ఉద్యోగుల అక్రమ నిర్బంధాలకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపింది. కలెక్టరేట్‌ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని చెప్పారు. సీఎం నివాసం ముట్టడి కార్యక్రమాన్ని విరమించినా.. అరెస్టు చేయటం అన్యాయమని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. సీపీఎస్‌ రద్దు కోసం పోరాడుతున్న ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం వేధింపులు, బెదిరింపులు, బైండోవర్‌ చేయడం తగదని హితవు పలికారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 31 Aug 2022, 10:10 pm
పీఎన్జీవో తన పోరాటాన్ని ఉధృతం చేసింది. సెప్టెంబర్ 1న విద్రోహ దినంగా పాటిస్తామని ప్రకటించింది. ఉద్యోగుల అక్రమ నిర్బంధాలకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. రేపు కలెక్టరేట్‌ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని చెప్పారు. ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని విరమించినా.. అరెస్టు చేయటం అన్యాయమని మండిపడ్డారు. సీపీఎస్‌ రద్దు కోసం పోరాడుతున్న ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం వేధింపులు, బెదిరింపులు, బైండోవర్‌ చేయడం తగదని హితవు పలికారు. ఉద్యోగులపై ప్రభుత్వం పెట్టిన కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.
Samayam Telugu AP NGO
ఏపీ ఎన్జీవో (ఫైల్ ఫొటో)


సీపీఎస్‌ రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదని ఏపీ ఎన్జీవో సంఘం స్పష్టం చేసింది. సీఎం వైఎస్ జగన్ తాను ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ఉద్యమం తప్పదని సంఘం నేతలు హెచ్చరించారు. మరోవైపు.. సీపీఎస్‌ను రద్దు చేయాలంటూ ఉద్యోగులు తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని సెప్టెంబర్‌ 11కి వాయిదా వేశారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.