యాప్నగరం

ఏపీ పంచాయతీ ఎన్నికలు.. నామినేషన్లు వేసేందుకు వస్తున్నవారికి షాక్

కొన్ని జిల్లాల్లో నామినేషన్‌ దాఖలు చేయడానికి వచ్చిన అభ్యర్థలకు నిరాశ మిగులుతోంది. నామినేషన్ల వేసేందుకు ఆసక్తి చూపిస్తున్నా.. స్వీకరించేందుకు అధికారులు సిద్ధం కాలేదు.

Samayam Telugu 25 Jan 2021, 12:41 pm
ఏపీలో పంచాయతీ ఎన్నికలపై గందరగోళం కొనసాగుతోంది. మొదటి దశలో 11 జిల్లాలోని 14 రెవెన్యూ డివిజన్లలో ఎన్నికలు నిర్వహిస్తుండగా.. సోమవారం నుంచి తొలి దశ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 27 నామినేషన్ల దాఖలకు ఆఖరి రోజు సోమ, మంగళ, బుధవారాల్లో మాత్రమే నామినేషన్లు స్వీకరించనున్నారు. నోటిఫికేషన్ వచ్చినా జిల్లాల్లో పరిస్థితి మాత్రం గందరగోళంగా మారింది. నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు సిద్ధమైనా తీసుకునేది ఎవరనే చర్చ మొదలైంది.
Samayam Telugu ap panchayat elections suspense continues on nomination process
ఏపీ పంచాయతీ ఎన్నికలు.. నామినేషన్లు వేసేందుకు వస్తున్నవారికి షాక్


కొన్ని జిల్లాల్లో నామినేషన్‌ దాఖలు చేయడానికి వచ్చిన అభ్యర్థలకు నిరాశ మిగులుతోంది. నామినేషన్ల వేసేందుకు ఆసక్తి చూపిస్తున్నా.. స్వీకరించేందుకు అధికారులు సిద్ధం కాలేదు. కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు వెనక్కి తిరిగి వెళ్లిపోతున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం మండలం తూముకుంట ఎంపీడీవో కార్యాలయానికి వచ్చిన షమీన్‌తాజ్‌ అనే అభ్యర్థిని వచ్చారు. నామినేషన్‌ పత్రాలు ఇవ్వాలని కోరగా.. తమకు రాలేదని అభ్యర్థికి కార్యాలయం అధికారులు తెలిపారు.. దీంతో ఆమె వెనుదిరిగి వెళ్లిపోయారు. అలాగే సోమందేవపల్లి ఎంపీడీవో కార్యాలయానికి కాంగ్రెస్ అభ్యర్థి రాగా.. నామినేషన్ల పత్రాలు లేవంటూ అధికారులు వెనక్కి పంపారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో అధికారులు నామినేషన్లు స్వీకరించడం లేదని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.