యాప్నగరం

సుప్రీం కోర్టులో జగన్ సర్కారుకు షాక్: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ దూకుడు, నేడే..!

ఏపీలో స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టులో జగన్ సర్కారుకు షాక్ తగిలింది. దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు పెంచారు.

Samayam Telugu 23 Jan 2021, 11:40 am
ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను నిలిపివేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో జగన్ సర్కారు వేసిన పిటిషన్‌పై సందిగ్ధత నెలకొంది. కోర్టు సమయం ముగియడంతో అత్యవసర విచారణకు శుక్రవారం సమయం దొరకలేదు. ఇక, ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ మొత్తం తప్పుల తడకగా ఉందని, దాన్ని సరిచేయాలని వైసీపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పిటిషన్‌ వెనక్కివచ్చేయగా, మళ్లీ ఈరోజే రిజిస్ట్రీ పిటిషన్‌ను సరిచేసి దాఖలు చేయలేకపోవచ్చని వైసీపీ లాయర్లు చెబుతున్నారు.
Samayam Telugu నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన జగన్ సర్కార్

AP Local Body Election Notification: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. జిల్లాలవారీగా వివరాలు ఇవేదీంతో ఏపీ సర్కార్ మరో ఆలోచన చేస్తోంది. శనివారం నాడే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో సుప్రీం కోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేయాలని జగన్ ప్రభుత్వం యోచిస్తోంది. కాగా, స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలును నిలిపేయాలని ఏపీ సర్కార్ సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌లో అత్యవసర విచారణ కోరుతున్నట్లు ప్రభుత్వం మెన్షన్ చేసింది. అయితే, కోర్టు సమయం ముగియడంతో ఏపీ సర్కార్‌‌ సందిగ్ధంలో పడింది.
జగన్ సర్కారుకు నిమ్మగడ్డ రమేష్ ఊహించని షాక్.. ఏకంగా ఆ 9 మందిపై..!సుప్రీం కోర్టులో జగన్ సర్కారుకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ దూకుడు పెంచారు. శనివారం ఉదయం 10 గంటల ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు రెడీ అయ్యారు. అలాగే శనివారం ఉదయమే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టి పట్టుదలగా ఉన్న తరుణంలో తర్వాత ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకుంటుందోనన్న ఆసక్తినెలకొంది.

ఇక, ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఉత్తర్వులను నిలిపివేస్తూ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసిన విషయం తెలిసిందే. అలాగే ఎస్ఈసీ నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికల ప్రక్రియను కొనసాగించవచ్చని హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు కూడా చేసింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని సుప్రీం కోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.