యాప్నగరం

NOTAను పోలి ఉంది.. ఆ గుర్తును రద్దు చేయండి.. ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు

పంచాయతీ ఎన్నికల వేళ.. ఓ గుర్తును రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేసింది. కత్తెర గుర్తును రద్దు చేయాలని.. ఇది నోటాను పోలి ఉందని ఫిర్యాదులో పేర్కొంది.

Samayam Telugu 11 Feb 2021, 9:14 pm
పంచాయతీ ఎన్నికల వేళ.. కత్తెర గుర్తును రద్దు చేయాలని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కత్తెర గుర్తు, నోటా గుర్తు దాదాపు ఒకేలా ఉండటం వల్ల.. ప్రజలు గందరగోళానికి గురవుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓటర్లు గందరగోళానికి లోనుకాకుండా చూడటం కోసం కత్తెర గుర్తును రద్దు చేయాలని‌ కోరారు. కత్తెర గుర్తు మీద పోటీ చేసే అభ్యర్థికి ఓటేసే క్రమంలో కొందరు ఓటర్లు నోటాకు ఓటేస్తున్నారన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పరిధిలో మొగుళ్లపల్లి పంచాయతీలో టీడీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన పైనా ఫిర్యాదు చేశారు.
Samayam Telugu nota


ఎన్నికల్లో గుర్తును పోలిన గుర్తులు ఉండటంతో పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేసిన ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. కాగా పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇలా ఫిర్యాదు చేయడం మాత్రం అరుదనే చెప్పొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.