యాప్నగరం

జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. అమరావతిలో స్థానిక ఎన్నికల్లేవ్!

రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన ఏపీ పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి. అమరావతి పరిధిలో ఉన్న గ్రామాలను స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మినహాయించాలని విజ్ఞ‌ప్తి

Samayam Telugu 13 Jan 2020, 10:18 am
జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోందా.. అమరావతికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతోందా.. పరిస్థితి చూస్తే అలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. అమరావతి పరిధిలోని గ్రామాలను స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మినహాయించాలని ఈసీకి ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది.
Samayam Telugu amaravati.


స్థానిక సంస్థల ఎన్నికలపై లేఖ రాయడం వెనుక ఆసక్తిక కారణం ఉంది. అమరావతి ప్రాంతంలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే అంశంపై ఇవాళ జరిగే హై పవర్ కమిటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. యర్రబాలెం, బేతపూడి, నవులూరును మంగళగిరి మున్సిపాలిటీలో కలపాలని.. పెనుమాక, ఉండవల్లి గ్రామాలను తాడేపల్లిలో కలపాలని ప్రతిపాదించారట. మిగిలిన గ్రామాలన్నింటినీ కలిపి అమరావతి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఎన్నికల సంఘానికి లేఖ రాశారట. దీనిపై ప్రభుత్వం నుంచి స్ఫష్టత రావాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.