యాప్నగరం

రైతుల కోసం ఇసుక బస్తాలు మోసి.. శభాష్ రఘువీరారెడ్డి

Anantapur Rains| భారీ వర్షాలతో గంగలవాయి పాళ్యం చెరువుకు గండి. పూడ్చేందుకు రంగంలోకి దిగిన రైతులు.. వారితో కలిసి ఇసుక బస్తాలు మోసిన పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి.

Samayam Telugu 29 Sep 2019, 5:27 pm
రైతులకు అండగా నిలిచారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. వర్షాలతో చెరువుకు గండిపడటంతో రైతులు, స్థానికులతో కలిసి ఆ గండిని పూడ్చాడు. ఆయన కూడా రైతుల్లో ఒకరిగా మారిపోయారు. పంచె కట్టి.. తలపాగా చుట్టి ఇసుక బస్తాలను మోసారు.. ఇలా అందరూ చేయి, చేయి కలిపి చెరువుకు పడిన గండిని పూడ్చగలిగారు.
Samayam Telugu raghu.


Read Also: జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ ప్రభుత్వ ఉద్యోగులంతా..

అనంతపురం జిల్లాలో కొద్దిరోజులుగా వర్షాలు పడుతున్నాయి. రాయదుర్గం, యాడికి, మడకశిర మండలాలు వరదలు మునిగాయి. ఇటు వరద దెబ్బకు గంగలవాయి పాళ్యం చెరువుకు గండి పడింది. వరద నీరు వృథాగా పోతుండటంతో రైతులు, స్థానికులు రంగంలోకి దిగారు. ఇసుక బస్తాలతో గండిని పూడ్చే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న రఘువీరా రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు.

రైతుల కష్టాన్ని చూసిన రఘువీరారెడ్డి కూడా రంగంలోకి దిగారు తలపాగా చుట్టి.. రైతులతో కలిసి ఇసుక బస్తాలను చెరువు దగ్గరకు మోసుకెళ్లారు. బస్తాలు మోస్తూనే.. గండి పూడ్చే వరకు అక్కడి ఉండి పనుల్ని పర్యవేక్షించారు. ఫోటోలకు పోజులిచ్చే రాజకీయ నేతలు ఉన్న ఈ రోజుల్లో ప్రజల కష్టాల్ని చూసి అండగా నిలిచిన రఘువీరారెడ్డిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.