యాప్నగరం

సభలు, సమావేశాలపై ఎలాంటి నిషేధం లేదు.. జీవో నంబర్ 1పై ఏపీ పోలీసుల క్లారిటీ

ఏపీలో సభలు, సమావేశాలపై ఎలాంటి నిషేధం లేదని ఏపీ పోలీసులు వెల్లడించారు. జీవో నంబర్ 1కి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్న తరుణంలో దీనిపై పోలీసులు వివరణ ఇచ్చారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 10 Jan 2023, 8:53 pm
జగన్ సర్కారు తీసుకొచ్చిన జీవో నంబర్‌ 1పై జరగుతున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్‌ అడిషనల్‌ డీజీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌‌ వివరణ ఇచ్చారు. ఈ మేరకు మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో మంగళవారం రవిశంకర్ మాట్లాడుతూ.. 1861 పోలీస్‌ చట్టానికి లోబడే జీవో నంబర్‌ 1 విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అయితే, షరతులకు లోబడి సభలు, సమావేశాలు నిర్వహించుకునేంకు అనుమతి ఇస్తామన్నారు. రాష్ట్రంలో సభలు, సమావేశాలపై ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సభలు, సమావేశాలు నిషేధం అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
Samayam Telugu మీడియాతో మాట్లాడుతున్న అడిషనల్ డీజీపీ రవిశంకర్


ఇటీవల జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈ జీవో తీసుకొచ్చినట్లు ఏడీజీపీ రవి శంకర్‌ వెల్లడించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా సభలు నిర్వహించుకోవాలని సూచించారు. పోలీసులు వేదిక స్థలాన్ని పరిశీలించి అనుమతి ఇస్తారని తెలిపారు. అయితే రహదారులు, రోడ్లపై సభలకు అనుమతి లేదన్నారు. అది కూడా అత్యవసరమైతే అనుమతులతో నిర్వహించుకోవచ్చని వెల్లడించారు.

ఈ జీవో ఉద్దేశం ఎవరిపైనా నిషేధం కాదని రవి శంకర్ స్పష్టం చేశారు. ప్రజల రక్షణ, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ఉండటం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని జీవో నంబర్‌ 1ను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత చట్టం దేశవ్యాప్తంగా అమలవుతున్నదేనని వివరించారు.

అత్యవసర పరిస్థితుల్లో అనుమతులు..అలాగే, ప్రజలకు అసౌకర్యం కలిగించేలా రహదారులపై సభలు వద్దన్నట్లు లా అండ్‌ ఆర్డర్‌ డీఐజీ రాజశేఖర్‌ తెలిపారు. మరీ అత్యవసర పరిస్థితుల్లో అనుమతులు తీసుకోవచ్చని పేర్కొన్నారు. సన్నగా, ఇరుగ్గా ఉండే రోడ్లపై సభల వల్ల సాధారణ ప్రజలకు ఇబ్బంది ఏర్పుడుతుందని.. అంబులెన్సులు, విమాన ప్రయాణాల వారికి సమస్యలు తీసుకురావద్దని సూచించారు. అందువల్లే పబ్లిక్ గ్రౌండ్లలో సభలు జరుపుకోవాలని జీవోలో ఉందని వివరించారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.