యాప్నగరం

నేడు కోడెల శివప్రసాద్ ప్రథమ వర్ధంతి.. కుమారుడికి నోటీసులు

దివంగత కోడెల శివప్రసాదరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఏర్పాట్లు చేస్తున్న ఆయన కుమారుడికి నోటీసులిచ్చారు.

Samayam Telugu 15 Sep 2020, 11:51 pm
దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తొలి వర్ధంతి బుధవారం జరగనుంది. దీంతో గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాలకు కోడెల శివప్రసాద్ అభిమానులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కోవిడ్ 19 నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ పోలీసులు పలువురికి నోటీసులిచ్చారు. ఇందులో భాగంగా కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాంకు సైతం మంగళవారం పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Samayam Telugu కోడెల శివప్రసాదరావు కుమారుడికి నోటీసులు


కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలుతున్న నేపథ్యంలో బహిరంగంగా ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి వీల్లేదని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. పోలీసుల తీరుపై కోడెల శివరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఎట్టిపరిస్థితుల్లోనూ యథావిధిగా అన్ని కార్యక్రమాలు చేపడతామని కోడెల శివరాం ప్రకటించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సభలకు లేని అడ్డంకులు మాకు ఎందుకని కోడెల శివరాం పోలీసులను ప్రశ్నించారు. కోడెల శివప్రసాద్ ప్రజా నాయకుడని, ఆయన ప్రథమ వర్ధంతిని జరిపి తీరుతామని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.