యాప్నగరం

హైదరాబాద్, ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రా వచ్చే వారికి షాక్.. ఈ రూల్స్ పాటిస్తేనే ఎంట్రీ.. పోలీసుల కీలక ప్రకటన!

అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా ప్రయాణాలపై ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Samayam Telugu 10 May 2021, 11:57 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. కర్ఫ్యూ సమయంలో ప్రయాణాలకు తప్పనిసరిగా అనుమతి పొందాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు. కర్ఫ్యూ సమయంలో ఇతర రాష్ట్రాలు, అంతర్ జిల్లాలో ప్రయాణానికి తప్పనిసరిగా ఈ-పాస్ ద్వారా అనుమతి పొందాలని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రకటించింది. సిటిజన్ సర్వీస్ పోర్టల్ (http://appolice.gov.in), ట్విట్టర్ (AP POLICE 100), ఫేస్ బుక్ (@ANDHRAPRADESH STATE POLICE) ద్వారా ఈ-పాస్ పొందవచ్చని పేర్కొంది.
Samayam Telugu ఏపీ బోర్డర్


అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించే వారు మాత్రమే పూర్తి ధ్రువపత్రాలతో ఈ-పాస్ వినియోగించుకోవాలని ఏపీ పోలీస్ శాఖ సూచించింది. శుభకార్యాలు, అంతక్రియలకు సంబంధించి ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా సంబంధిత స్థానిక అధికారుల వద్ద సరైన గుర్తింపు పత్రాలతో అనుమతి పొందాలని స్పష్టం చేసింది. తమ శాఖ అనుక్షణం ప్రజల రక్షణ కోసం, ప్రజల వెంటే ఉంటుందని స్పష్టం చేసింది.

రాష్ట్ర ప్రజలు కరోనా నిబంధనలను తప్పక పాటించాలని, అంతర్రాష్ట్ర రాకపోకలపై నిబంధనలు కొనసాగుతాయని కోవిడ్ కమాండ్ కంట్రోల్ తెలిపింది. అంతర్రాష్ట్ర కదలికలపై ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఈ షరతులు కొనసాగుతాయని వెల్లడించింది.


రాష్ట్రంలో, ఇతర రాష్ట్ర ప్రయాణాలకు ఈ-పాస్‌ తీసుకోవాలని కోరారు. సిటిజన్‌ సర్వీస్‌ పోర్టల్, ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ద్వారా ఈ-పాస్‌ పొందొచ్చని చెప్పారు. అత్యవసరంగా వెళ్లే వారే ఈ వెసులుబాటు వినియోగించుకోవాలని సూచించారు. శుభకార్యాలు, అంత్యక్రియల కోసం అధికారుల అనుమతి పొందాలన్నారు. ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.