యాప్నగరం

పోలీసులు విపరీతంగా గిచ్చారు.. ఎందుకో తెలిసి షాకయ్యా: ఎంపీ జయదేవ్

పోలీసులు తనను అరెస్టు చేసేటప్పుడు విపరీతంగా గిచ్చారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. పోలీసులు అలా ఎందుకు చేశారో తెలుసుకుని షాకైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

Samayam Telugu 28 Jan 2020, 6:36 pm
పోలీసులు తనను విపరీతంగా గిచ్చారని, తర్వాత ఎందుకు ఇలా చేశారో తెలుసుకుని షాకైనట్లు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. రాజధానిని అమరావతిలో కొనసాగించాలంటూ నిరసన చేపట్టిన ఎంపీ గల్లా జయదేవ్‌ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అరెస్ట్ చేసిన క్రమంలో పోలీసులు తనను విపరీతంగా గిచ్చారని ఆరోపించారు.
Samayam Telugu jaydev 1


తనపై పోలీసులు దాడి చేస్తుంటే మహిళలు అడ్డుపడ్డారని జయదేవ్ తెలిపారు. ఆ సమయంలో ఎస్పీ లాఠీతో తనను కొట్టేస్తారని భయపడినట్లు వెల్లడించారు. అరెస్ట్ చేసిన రోజు తనను విపరీతంగా గిచ్చారని చెప్పారు. గిచ్చుతుంటే మొదట తనకేం అర్థం కాలేదన్నారు. అయితే గిచ్చడం ఏంటని తీవ్రంగా ఆలోచించినట్లు చెప్పారు. తర్వాత పోలీసులు ఎందుకలా చేస్తా గిచ్చుతారో తెలిసి షాకైనట్లు ఎంపీ తెలిపారు.

Also Read: మండలి రద్దు.. ట్రోల్స్‌తో లోకేశ్‌, జగన్‌ను ఆడుకున్న నెటిజన్లు

దెబ్బలు బయటకు కనిపించకుండా పోలీసులు ఇలా చేశారని అర్థమైందని ఎంపీ చెప్పారు. అరెస్ట్ ఘటన జరిగి వారం గడిచినా తన చేతి గాయం మానలేదని, నొప్పులు తగ్గలేదని వ్యాఖ్యానించారు. పోలీసుల ట్రీట్మెంట్‌లో అదొక రకమని తెలిసిందన్నారు.ఎంపీ అయిన తననే ఇలా హింసిస్తే ఇక సామాన్య ప్రజలను ఎలా ట్రీట్ చేస్తారో అర్థం చేసుకోవాలని గల్లా ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అసెంబ్లీ ముట్టడిలో తాము రాళ్లు వేయలేదన్నారు. పోలీసుల్లోనే కొందర రాళ్లు వేశారని అనుకుంటున్నట్లు వెల్లడించారు. కాగా, అమరావతిని మార్చబోమని వైసీపీ నేతలే అనేక సార్లు చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటికైనా రాజధాని తరలింపు విషయాన్ని పునరాలోచించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Also Read: మనది ఎందుకు హిందూ దేశం కాలేదో తెలుసా.. వపన్ కళ్యాణ్ చెప్పిన ముచ్చట

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.