యాప్నగరం

ఏపీ: 'కరోనా అయినా బెదరరు.. ఖాకీ డ్రస్ వాళ్లకు వ్యాక్సిన్'

'మీరు ఇంట్లో ఉండండి మేము వీధుల్లో కాపలా కాస్తాం అంటూ కొరోనా అయినా మరణం అని తెలిసినా కాఖీ దుస్తులే వారికి వాక్సిన్. ఇంట్లోనే ఉండి వారి త్యాగాన్ని గౌరవిద్దాం' అంటూ స్పెషల్ వీడియో.

Samayam Telugu 4 Apr 2020, 12:21 pm
లాక్‌డౌన్ దేశవ్యాప్తంగా నడుస్తోంది. ఇలాంటి విపత్కర సమయంలో.. పోలీసులు 24 గంటలు రోడ్లపైనే గడిపేస్తున్నారు. జనాల కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. రోడ్లపైకి రావొద్దంటూ అంటూ జాగ్రత్తలు సూచిస్తున్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని చెబుతున్నా.. ఆ నిబంధనల్ని పట్టించుకోకుండా రోడ్ల మీదకు వస్తున్నారు కొంతమంది జనాలు. పోలీసులు మొత్తుకుని చెబుతున్నా మాట వినడం లేదు. కొంతమంది ఆకతాయిలు రోడ్లపై తిరుగుతున్నారు. దీంతో అక్కడక్కడా పోలీసులు లాఠీలకు పని చెప్పక తప్పడం లేదు.
Samayam Telugu dgp


ప్రజలు కూడా పోలీసుల కష్టాలను అర్ధం చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. 24 గంటలు వారు పడుతున్న కష్టాలను ప్రజలు గుర్తించడం లేదనే చెప్పాలి. ఎందుకంటే వాళ్లకు కుటుంబాలు ఉన్నాయి. బయట కరోనా భయం వెంటాడుతోంది.. అయినా ప్రజల కోసం వారు రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్నారు. పోలీసుల్లో భరోసా నింపేలా.. ప్రజల కోసం వారు చేస్తున్న సేవను తెలియజేసేలా ఓ వీడియోను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.
'మీరు ఇంట్లో ఉండండి మేము వీధుల్లో కాపలా కాస్తాం అంటూ కొరోనా అయినా మరణం అని తెలిసినా కాఖీ దుస్తులే వారికి వాక్సిన్. ఇంట్లోనే ఉండి వారి త్యాగాన్ని గౌరవిద్దాం' అంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఇంటికే పరిమితం కావాలని పోలీసులు సూచిస్తున్నారు. తమకు సహకరించాలని కోరుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.