యాప్నగరం

పరారీలో మాజీ మంత్రి దేవినేని ఉమా.. కొంపముంచిన ఆ వీడియో!

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోసం పోలీసులు గాలిస్తుండగా, ఆయన పరారీలో ఉన్నారు.

Samayam Telugu 20 Apr 2021, 8:22 pm
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వీడియోను మార్ఫింగ్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్‌ వీడియో మార్ఫింగ్ కేసులో కర్నూలు సీఐడీ పోలీసులు ఆయనపై చీటింగ్‌ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం సీఐడీ బృందం గొల్లపూడిలోని దేవినేని ఉమా ఇంటికి చేరుకునేసరికి ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ చేశారు. ఇక ఉమా ఎక్కడికి వెళ్లారో తమకు తెలియదని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Samayam Telugu దేవినేని ఉమా


కాగా, ఈ నెల 7న ప్రెస్మీట్‌లో సీఎం జగన్ మాట్లాడినట్లు ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దేవినేని ఉమాపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. నారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు ఈ నెల 10న ఉమాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీఐడీ.. 464, 465, 468, 469, 470, 471, 505, 120 బీ సెక్షన్ల కింద దేవినేని ఉమాపై కేసు నమోదు చేశారు. ఈ నెల 15, 19న విచారణకు రావాలని రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో విచారణ నిమిత్తం దేవినేని ఉమా ఇంటి వద్దకు రాగా, అప్పటికే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కాగా, అయితే దేవినేని ఉమా కోసం తిరుగుతున్న పోలీసులకు సాయంత్రం ఆయన ట్విస్ట్ ఇచ్చారు. సీఐడీ అధికారుల నోటీసులపై దేవినేని ఉమా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తనను అరెస్ట్‌ చేసేందుకు సీఐడీ ప్రయత్నిస్తోందని, సీఐడీ నోటీసులను రద్దు చేయాలని పిటిషన్‌లో దేవినేని ఉమా కోరారు. దీంతో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.