యాప్నగరం

అమలాపురం విధ్వంసం వెనకున్న అదృశ్య శక్తులందర్నీ బయటకు లాగుతాం.. పోలీసుల హెచ్చరిక

అమలాపురం అల్లర్లకు పాల్పడ్డ విధ్వంసకారులపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ విధ్వంసం వెనక ఉన్న వారందర్నీ బయటకు లాగుతామని వార్నింగ్ ఇచ్చారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 25 May 2022, 7:34 am
అమలాపురం విధ్వంసం వెనక ఏయే శక్తులు ఉన్నాయే అందరినీ బయటకు తీస్తామని డీఐజీ పాలరాజు వెల్లడించారు. ఈ దాడులకు కారణమైన వారిని అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. అమలాపురం విధ్వంసంపై డీఐజీ పాలరాజు మీడియాతో మాట్లాడుతూ.. అమలాపురంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అమలాపురంలో అదనపు బలగాలను మోహరించామని చెప్పారు.
Samayam Telugu అమలాపురంలో అల్లర్లు దృశ్యాలు


ఆందోళనకారుల దాడుల్లో గాయపడిన పోలీసులకు ప్రాణాపాయం ఏమీ లేదని డీఐజీ పాలరాజు తెలిపారు. గాయాలపాలైన పోలీసులు ప్రస్తుతం బాగానే ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం అమలాపురంలో 600 మంది పోలీసులు విధుల్లో ఉన్నారని పేర్కొన్నారు.

ఇక, కోనసీమ ప్రజలంతా సంయమనం పాటించాలని డీఐజీ పాలరాజు విజ్ఞప్తి చేశారు. హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఆయన.. ఇప్పటికే కొందరిని గుర్తించినట్లు చెప్పారు. సీసీటీవీ ఫుటేజీల ద్వారా ఆందోళనకారులను గుర్తిస్తామని, ఈ ఘటన వెనుక ఏయే శక్తులు ఉన్నాయో అందరినీ బయటకు తీస్తామని వెల్లడించారు.

అలాగే, కోనసీమ ఉద్రిక్తతలపై రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి స్పందించారు. కోనసీమలో పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. కొందరు యువకులు ఆందోళన పేరుతో విధ్వంసానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అయితే పోలీసులు ఎంతో సంయమనం పాటించారని తెలిపారు. విధిలేని పరిస్థితుల్లోనే గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలిపారు. అమలాపురానికి విశాఖపట్నం, కృష్ణా జిల్లాల నుంచి కూడా అదనపు బలగాలను మోహరించామని, విధ్వంసం వెనుక ఎవరున్నారో విచారణ చేస్తున్నామని వెల్లడించారు.

కలెక్టరేట్ దగ్గరకు వచ్చిన ఆందోళనకారులతో మాట్లాడామని, వారి అభ్యర్థన మేరకు 12 మందిని కలెక్టర్‌ను కలవటానికి అవకాశం కల్పించినట్లు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఆ తర్వాత కొందరు ఉద్దేశపూర్వకంగా అల్లర్లకు పాల్పడినట్లు చెప్పారు. ఇద్దరు వీఐపీల ఇళ్లు తగులబెట్టారని, వాహనాలకు నిప్పు పెట్డారని వివరించారు. ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వంతో చర్చించాలి కానీ, విధ్వంసం చేస్తామంటే ఊరుకునేది లేదని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం అల్లర్లు సద్దుమనిగాయని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.