యాప్నగరం

ప్రధాని మోదీ పిలుపు: ‘ఈ జాగ్రత్తలు పాటించండి.. లేకుంటే పవర్ గ్రిడ్ కుప్పకూలే ఛాన్స్’

Light Diya: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన లైట్ దియా ప్రోగ్రామ్‌కు సంబంధించి ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ పలు సూచనలు ఇచ్చారు. రాత్రి 9 గంటలకు విద్యుత్ లైట్లు మాత్రమే ఆర్పాలని, మిగిలినవి ఆన్‌లోనే ఉంచాలని సూచించారు.

Samayam Telugu 5 Apr 2020, 7:10 pm
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా భారతీయుల్లోని ఐక్యతా భావాన్ని ప్రపంచానికి చాటేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘ లైట్‌ దియా’కు దేశ ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 9 గంటలకు విద్యుత్ లైట్లు ఆర్పే ముందు ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథ్‌ సూచించారు.
Samayam Telugu pm_modi_speech_660_080819073413


ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు విద్యుత్ బల్బులు ఆర్పినప్పటికీ నివాస గృహంలోని ఫ్యాన్స్, రిఫ్రిజిరేటర్‌లు, ఏసీలను ఆ 9 నిమిషాల పాటు ఆన్‌లో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఒకేసారి విద్యుత్ వినియోగం మొత్తం నిలిపివేస్తే పవర్ గ్రిడ్ కుప్పకూలి పోయే ప్రమాదం ఉందన్నారు.

పవర్ గ్రిడ్ కుప్పకూలకుండా ఉండేందుకు తాము కూడా కొన్ని చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల పంపు సెట్లకు రాత్రి 8:30 గంటల నుంచే పవర్ ఇస్తున్నామన్నారు. కరోనా వైరస్‌ వల్ల కరెంట్ బిల్లులు ఇవ్వడం వీలు కావడం లేదని, వినియోగదారులు మార్చి నెలలో చెల్లించిన బిల్లు మొత్తాన్నే ఇప్పుడు చెల్లించవచ్చని చెప్పారు. బిల్లుల చెల్లింపులో ఆలస్యం అయినా కనెన్షన్‌ను తొలగించబోమని భరోసా ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.