యాప్నగరం

ఏపీలో తగ్గిన కేసులు.. భారీగా డిశ్చార్జిలు

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు కొద్దిరోజులుగా తక్కువగా నమోదవుతున్నాయి. కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య రోజువారీ కేసుల కంటే ఎక్కువగా ఉంది.

Samayam Telugu 4 Jun 2021, 6:49 pm
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 10,413 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. కరోనా కారణంగా రాష్ట్రంలో 83 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 14 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క రోజు వ్యవధిలో 15,649 మంది కరోనా నుంచి కోలుకున్నారు. పాజిటివ్ కేసులతో పోలిస్తే కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,33,773 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
corona


రాష్ట్రంలో కర్ఫ్యూ నిబంధనలు అమల్లోకి రాకముందు రోజుకి సుమారు 20 వేల నుంచి 25 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యేవి. కరోనా ఉధృతి పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కర్ఫ్యూ అమల్లోకి తెచ్చింది. ఉదయం 6 నుంచి 12 గంటల వరకూ మాత్రమే నిత్యవసరాల కోసం ప్రజలు బయటికి వచ్చేందుకు అనుమతి ఉంది. కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా మరో రెండు వారాలు కర్ఫ్యూ పొడిగించింది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.