యాప్నగరం

ఏపీలో కీలక పరిణామం.. గవర్నర్‌ను కలిసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్

ఏపీ ఎస్ఈసీ హౌస్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ను త్రిసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించింది.. కానీ వాదనలు ప్రారంభమైన కొద్దిసేపటికే విచారణ వాయిదా పడింది. మళ్లీ మధ్యాహ్నం ఒంటి గంటకు మళ్లీ త్రిసభ్య ధర్మాసనం వాదనలు విననుంది.

Samayam Telugu 12 Jan 2021, 11:55 am
ఏపీ గవర్నర్ హరిచందన్‌ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలిశారు. రాజ్‌భవన్‌లో ఇద్దరి భేటీ జరిగింది.. పంచాయతీ ఎన్నికల షెడ్యుల్, హైకోర్టు తీర్పు, తాజా పరిణామాలపై ఇద్దరి మధ్య జర్చ జరిగినట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలపై దుమారం రేగుతున్న వేళ నిమ్మగడ్డ గవర్నర్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది. ఆయన ప్రభుత్వ తీరుపై ఏమైనా ఫిర్యాదులు చేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ఈసీలోని ఉద్యోగులను ప్రభుత్వం ప్రభావితం చేస్తోంది అంటూ ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులను ఎస్ఈసీకి సహకరించకుండా ప్రభుత్వం ప్రోత్సహిస్తూదని నిమ్మగడ్డ సీరియస్‌గా ఉన్నారట.
Samayam Telugu గవర్నర్-నిమ్మగడ్డ


మరోవైపు ఏపీ ఎస్ఈసీ హౌస్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ను త్రిసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించింది.. కానీ వాదనలు ప్రారంభమైన కొద్దిసేపటికే విచారణ వాయిదా పడింది. మళ్లీ మధ్యాహ్నం ఒంటి గంటకు మళ్లీ త్రిసభ్య ధర్మాసనం వాదనలు విననుంది. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ వెలురించిన నిర్ణయంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. డివిజన్‌ బెంచ్‌లో అప్పీలుకు వెళ్లారు. హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు సుప్రీం కోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఉందని పిటిషనర్‌ పేర్కొన్నారు.

సోమవారం రోజు పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ఏజీ, ఎస్‌ఈసీ తరఫున న్యాయవాది అశ్వనీకుమార్‌ రెండు గంటలపాటు వాదనలు వినిపించారు. ఏకకాలంలో, ఎన్నికలు, కరోనా వ్యాక్సిన్‌ కష్టమవుతుందని ఏజీ కోర్టుకు వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేసింది. ఎన్నికల షెడ్యూల్‌పై ఎస్‌ఈసీ నిర్ణయం సహేతుకంగా లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ అభిప్రాయాన్ని ఎస్‌ఈసీ పరిగణనలోకి తీసుకోలేదని వ్యాఖ్యానించింది. దీనిపై ఎస్ఈసీ అప్పీల్‌కు వెళ్లింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.