యాప్నగరం

AP Local Body Election Notification: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. జిల్లాలవారీగా వివరాలు ఇవే

రాష్ట్రంలో శాంతియుత వాతావరణంలో ఎన్నికల్ని నిర్వహిస్తామన్నారు. సుప్రీంకోర్టులో కేసు ఉంది.. ఎన్నికలు ఆపాలని ప్రభుత్వం కోరడం సహేతుకంగా లేదన్నారు నిమ్మగడ్డ. ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు వస్తే గౌరవించి.. పాటిస్తామన్నారు.

Samayam Telugu 23 Jan 2021, 11:41 am
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదలైంది. తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్‌‌ను కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేశారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికల్ని నిర్వహిస్తామన్నారు. సుప్రీంకోర్టులో కేసు ఉంది.. ఎన్నికలు ఆపాలని ప్రభుత్వం కోరడం సహేతుకంగా లేదన్నారు నిమ్మగడ్డ. ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు వస్తే గౌరవించి.. పాటిస్తామన్నారు. రెవెన్యూ డివిజన్‌ ప్రాతిపదికగానే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు.. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.
Samayam Telugu ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు

జగన్ సర్కారుకు నిమ్మగడ్డ రమేష్ ఊహించని షాక్.. ఏకంగా ఆ 9 మందిపై..!ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. సాయంత్రం 4 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. విజయనగరం, ప్రకాశం జిల్లాలకు తొలి విడతలో ఎన్నికలు నిర్వహించడం లేదని చెప్పారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు ఎవరు అవరోధం కలిగించాలని చూసినా కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఈసీ హెచ్చరించారు. 2021 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు జరపాలని భావించామని.. కానీ ఆ ప్రక్రియ పూర్తి చేయలేకపోయారని.. విధిలేని పరిస్థితిలో 2019 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు.
సుప్రీం కోర్టులో జగన్ సర్కారుకు షాక్: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ దూకుడు, నేడే..!ఈ నెల 25 అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 27 నామినేషన్ల దాఖలుకు తుది గడువు.. 28న నామినేషన్ల పరిశీలన.. 29న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలిస్తారు. 30న ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుని.. 31న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉంటుంది. తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు. ఫిబ్రవరి 5న పోలింగ్‌.. (ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 మధ్య పోలింగ్‌). పోలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యాక 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు.. ఫలితాలు వెల్లడిస్తారు. దీని తర్వాత ఉపసర్పంచి ఎన్నికను పూర్తి చేయటంతో మొదటి దశ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.

తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరిగే రెవెన్యూ డివిజన్లు

శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్లు
విశాఖ: విశాఖ రెవెన్యూ డివిజిన్
తూర్పు గోదావరి: అమలాపురం రెవెన్యూ డివిజన్
పశ్చిమ గోదావరి: ఏలూరు రెవెన్యూ డివిజన్
కృష్ణా: నూజివీడు రెవెన్యూ డివిజన్
గుంటూరు: గుంటూరు రెవెన్యూ డివిజన్
నెల్లూరు: నెల్లూరు రెవెన్యూ డివిజన్
చిత్తూరు: తిరుపతి రెవెన్యూ డివిజన్
కర్నూలు: ఆదోని రెవెన్యూ డివిజన్
అనంతపురం: పెనుగొండ రెవెన్యూ డివిజన్
కడప: కడప, జమ్మల మడుగు రెవెన్యూ డివిజన్లు

రెండో దశ ప్రక్రియ

జనవరి 29 నుంచి నామినేషన్ల స్వీకరణ
జనవరి 31 నామినేషన్ల దాఖలుకు తుది గడువు
ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన
ఫిబ్రవరి 2న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
ఫిబ్రవరి 3న అభ్యంతరాలపై తుది నిర్ణయం
ఫిబ్రవరి 4న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
ఫిబ్రవరి 9న పోలింగ్ (ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు) సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు

మూడో దశ ప్రక్రియ
ఫిబ్రవరి 2 అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ
ఫిబ్రవరి 4 నుంచి నామినేషన్ల దాఖలుకు తుది గడువు
ఫిబ్రవరి 5 నామినేషన్ల పరిశీలన
ఫిబ్రవరి 6న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
ఫిబ్రవరి 7న అభ్యంతరాలపై తుది నిర్ణయం
ఫిబ్రవరి 8న నామినేషన్ల తుది గడువు
ఫిబ్రవరి 13న పోలింగ్ (ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు) సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు

నాలుగో దశ ప్రక్రియ
ఫిబ్రవరి 6 నుంచి అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ
ఫిబ్రవరి 8న నామినేషన్ల దాఖలుకు తుది గడువు
ఫిబ్రవరి 9న నామినేషన్ల పరిశీలన
ఫిబ్రవరి 10న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
ఫిబ్రవరి 11న అభ్యంతరాలపై తుది నిర్ణయం
ఫిబ్రవరి 12న నామినేషన్లకు ఉపసంహరణకు తుది గడువు
ఫిబ్రవరి 17న పోలింగ్ (ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు) సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.