యాప్నగరం

జగన్ సర్కార్‌కు ట్విస్ట్ ఇచ్చిన నిమ్మగడ్డ.. హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే!

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పథకాలతో పాటూ ఇతర కార్యక్రమాల్లో పాల్గొనకూడదన్నారు. అలాగే ఎన్నికల కమిషన్ సీఎస్, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీలైనంత త్వరగా సమావేశం నిర్వహిస్తుందన్నారు.

Samayam Telugu 21 Jan 2021, 2:09 pm
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 11న సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది.. ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనని ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు పెంచారు. హైకోర్టు తీర్పు తర్వాత మీడియాకు ప్రెస్ నోట్ విడుదల చేశారు.
Samayam Telugu నిమ్మగడ్డ రమేష్

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్, కీలక ఆదేశాలురాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చినట్లేనని క్లారిటీ ఇచ్చారు. ఎల్లుండి నుంచి నాలుగు విడతల్లో పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్‌లు విడుదల కానున్నాయని.. నాలుగు దశల్లో (ఫిబ్రవరి 5, 9, 13, 17) ఎన్నికలు నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పథకాలతో పాటూ ఇతర కార్యక్రమాల్లో పాల్గొనకూడదన్నారు. అలాగే ఎన్నికల కమిషన్ సీఎస్, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీలైనంత త్వరగా సమావేశం నిర్వహిస్తుందన్నారు.
విజయవాడ: ఆర్టీసీ బస్సులో పోలీసుల తనిఖీలు.. బ్యాగులో అంత డబ్బు చూసి షాక్అంతేకాదు ఎన్నికల కమిషన్ పోలింగ్ సిబ్బంది, ఓటర్ల భద్రతపై ఫోకస్ పెట్టిందన్నారు. ఎన్నికల సమయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటామని.. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకు వెళతామన్నారు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో సహకరించాలన్నారు. అలాగే గతంలో జరిగిన ఘటనల దృష్ట్యా శాంతిభద్రతల విషయంలో ఎన్నికల కమిషన్ ఫోకస్ పెట్టిందన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ఇవాళ మధ్యాహ్నం ఎన్నికల కార్యాలయ సిబ్బందితో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం కానున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.