యాప్నగరం

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై మరో ట్విస్ట్

కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర సీఈవో విజయానంద్‌కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. జనవరి మాసాంతంలోపు ఓటర్ల జాబితాను అన్ని జిల్లాల్లో ప్రచురించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని..

Samayam Telugu 25 Nov 2020, 11:50 am
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎస్ఈసీ దూకుడు పెంచింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఆ దిశగా ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు తీర్పు కాపీని జతచేసి సీఎస్ నీలం సాహ్నీకి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. తాజాగా ఓటర్ల జాబితా అందించాలని కేంద్ర ఎన్నికల కమిషన్, ఏపీ సీఈవో విజయానంద్‌కు కూడా లేఖ రాశారు.
Samayam Telugu ఎస్ఈసీ నిమ్మగడ్డ


2021 జనవరిలో ఓటర్ల జాబితాను అందివ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర సీఈవో విజయానంద్‌కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. జనవరి మాసాంతంలోపు ఓటర్ల జాబితాను అన్ని జిల్లాల్లో ప్రచురించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్ కమిషనర్‌ను ఇందుకోసం సమన్వయం చేసుకోవాలని నిమ్మగడ్డ సూచించారు. ఎన్నికలు నిర్వహించకూడదని ప్రభుత్వం కోర్టుకు వెళ్లినా కర్ణాటక, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వివరాలను ప్రస్తావిస్తున్నారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పటికే సీఎస్‌కు లేఖ రాశారు. కలెక్టర్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడానికి సీఎస్ అంగీకరించలేదు. రెండుసార్లు వీడియో కాన్ఫరెన్స్ రద్దైంది. ఎన్నికల కమిషనర్‌కు సహకరించకపోతే ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందని హైకోర్టు గత ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆ ఉత్తర్వుల కాపీని జతచేసి సీఎస్‌కు నిమ్మగడ్డ మరో లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వం ప్రభుత్వం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.