యాప్నగరం

కరోనా నియంత్రణకు వేతనం విరాళం.. సచివాలయ ఉద్యోగుల నిర్ణయం

కరోనా వైరస్ నియంత్రణ కోసం ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు సచివాలయ ఉద్యోగులు ప్రకటించారు.

Samayam Telugu 23 Mar 2020, 5:29 pm
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ (కోవిడ్ 19) తీవ్ర ప్రభావం చూపిస్తున్న తరుణంలో రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా నియంత్రణ చర్యల కోసం ఒక రోజు వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు జమ చేస్తామని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ చర్యల్లో సచివాలయ ఉద్యోగులు కూడా పాల్గొంటున్నామని పేర్కొన్నారు.
Samayam Telugu AP_secretariat_amravati


సచివాలయ ఉద్యోగుల్లో 50 శాతం మందికి వర్క్ ఫ్రం హోం అమలు చేస్తున్నట్లు తెలిపారు. రవాణా సదుపాయాలు లేనందున ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పించాలని కోరినట్లు తెలిపారు. రవాణా సదుపాయం ఉన్న ఉద్యోగులందరం సచివాలయానికి వచ్చి పని చేస్తున్నట్లు వివరించారు.

ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని వెంకట్రామిరెడ్డి చెప్పారు. అలాగే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేసే అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఆర్డినెన్స్‌ ద్వారా బడ్జెట్‌ను ఆమోదించే అవకాశాలను పరిశీలించాలని వెంకట్రామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.