యాప్నగరం

ఆ 22మంది ఎమ్మెల్యేలను అడగొచ్చుగా.. తగ్గేది లేదు: ఏపీ సీనియర్ IPS ఏబీ వెంకటేశ్వరరావు

IPS Ab Venkateswara Rao తన సస్పెన్షన్ వ్యవహారంపై స్పందించారు. ఛార్జ్‌షీట్, ట్రయల్ లేని కేసులో సస్పెండ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. తాను న్యాయ పోరాటం చేస్తానని తేల్చి చెప్పారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 29 Jun 2022, 12:18 pm

ప్రధానాంశాలు:

  • సస్పెన్షన్ జీవో చేతికి రాలేదన్న IPS ఏబీ
  • కోర్టులో చెల్లదని చెప్పిన వెంకటేశ్వరరావు
  • శ్రీలక్ష్మికి నిబంధనలు వర్తించవా అని ప్రశ్న
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ఏబీ వెంకటేశ్వరరావు
ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటుపై న్యాయపోరాటం చేస్తానంటున్నారు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. సస్పెన్షన్ జీవో తన చేతికి ఇంకా ఇవ్వలేదని.. సోషల్ మీడియాలో మాత్రమే చూశానన్నారు. ఏసీబీ కేసు ఉన్న మాట వాస్తవమేనని.. ఒకటిన్నర సంవత్సరం క్రితం కేసు రిజిష్టర్ చేసినా ఇంతవరకూ ఛార్జ్‌షీట్ వేయలేదన్నారు. ట్రయల్ మొదలవకుండా సాక్షులను తాను ఎలా ప్రభావితం చేస్తానని ప్రశ్నించారు. ఇటువంటి చచ్చు సలహాలు ఏ తీసేసిన తహసీల్దార్, పనికిమాలిన సలహాదారులో ఇచ్చి ఉంటారన్నారు.
ఒకసారి హైకోర్టు కొట్టేసినప్పుడు అదే సెక్షన్ కింద మళ్లీ ఎలా సస్పెండ్ చేస్తారని ఏబీ ప్రశ్నించారు. 12 సీబీఐ, 6 ఈడీ కేసుల్లో జగన్‌కు ఛార్జ్‌షీట్‌లు ఉన్నాయన్నారు. ఐఏఎస్ అదికారి శ్రీలక్ష్మిపైనా ఛార్జ్‌షీట్‌లు ఉన్నాయని.. శ్రీలక్ష్మికి వర్తించని నిబంధనలు తనకు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. ఏసీబీ వాళ్ళు ఇచ్చిన నివేదికలో ప్రతి వాఖ్యం తప్పు.. తాను నిరూపిస్తాను అన్నారు. ఒక్క రూపాయి అవినీతి జరగని చోట అవినీతి కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఇజ్రాయెల్ వాళ్లకు రెండు లెటర్‌లు రాశారు. అవినీతి నిరోధక చట్టాలకు లోబడి పనిచేస్తామని చెప్పారు.

అసలు డబ్బులు ట్రాన్సక్షన్ జరగని కేసులో అవినీతి ఏంటని ఆయన ప్రశ్నించారు. కొందరు ఆఫీసర్లు చేసే పనుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు. పార్టీ మారిన 23 మంది ఎమ్మెల్యేల్లో 22 మంది ఎమ్మెల్యేలు బతికే ఉన్నారు.. పార్టీని మారమని తానేమైనా ప్రేరేపించానేమోననే విషయాన్ని వారిని అడగొచ్చుగా అంటూ కామెంట్ చేశారు. ఐపీఎస్ సంఘం ఎందుకు స్పందించడం లేదో వాళ్లనే అడగాలి అన్నారు. ఒకే అంశంపై ఎవరైనా ఒకరిపై రెండు సార్లు చర్యలు తీసుకుంటారా అని.. లీగల్‌గా ఇవేవీ చెల్లవు అని వ్యాఖ్యానించారు. న్యాయసమీక్షకు నిలబడే నిర్ణయాలు కావు ఇవి అంటూ వ్యాఖ్యలు చేశారు. మూడేళ్లలో తాను తప్పు చేసినట్లు ఎక్కడా ఒక్క ఆధారం కూడా లేదన్నారు.

ఇలాంటి వ్యక్తుల వల్ల వ్యవస్థలకు చెడ్డ పేరు వస్తుందన్నారు వెంకటేశ్వరరావు. కొంతమంది వ్యక్తులు, కొన్ని శక్తులు తనను టార్గెట్ చేశాయన్నారు. కోడి కత్తి కేసు అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని తగలబెట్టాలని చూస్తే గంటల్లోనే అడ్డుకున్నాను అన్నారు. ఎన్నో వెధవ పనులు అడ్డుకున్నందుకే తనను టార్గెట్ చేశారన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతాను అంటూ రాజభవన్ గేటు ముందు తాను కామెంట్ చేశానా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై న్యాయపోరాటం చేస్తానని.. సమాజానికి హాని కలిగించే పురుగులను తొలగించే వ్యవసాయం చేస్తున్నాను అన్నారు. దుర్మార్గుడైన రాజు పాలనలో పని చేసేకంటే అడవిలో వ్యవసాయం చేసుకోవడం మంచిదని ఒక కవి అన్నారన్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.