యాప్నగరం

AP Assembly: టీడీపీ సభ్యుల సస్పెన్షన్.. ఆ తొమ్మిది మంది ఔట్.!

ఏపీ రాజధాని అమరావతి వ్యవహారం అసెంబ్లీలో తీవ్ర దుమారానికి కారణమైంది. అమరావతిపై ప్రభుత్వ వైఖరిని టీడీపీ సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు. సభ నుంచి తొమ్మిది మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.

Samayam Telugu 17 Dec 2019, 5:56 pm
టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది. శాసన సభ జరగకుండా అడ్డుకున్న తొమ్మిది మంది తెలుగుదేశం సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు శాసన సభాపతి తమ్మినేని సీతారాం ప్రకటన చేశారు. కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, వెలగపూడి రామకృష్ణబాబు, బెందాళం అశోక్, వీరాంజనేయ స్వామి, మద్దాల గిరి, గద్దె రామ్మోహన్, అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావును సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.
Samayam Telugu ap-assembly


ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్న విషయం తెలిసిందే. గత వారం రోజులుగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఒకరిపై ఒకరు పదునైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు. జగన్ సర్కార్ విధానాలపై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ఎండగట్టే ప్రయత్నం చేస్తుండగా అధికార పార్టీ సభ్యులు ప్రతిపక్ష నేత చంద్రబాబు టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. కీలకమైన అంశాలపై చర్చ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి.

Also Read: ‘తిరుమలలో అన్యమత ప్రచారం..’ రాజీనామా చేస్తానన్న ఏపీ మంత్రి

తాజాగా ఏపీ రాజధాని అమరావతి వ్యవహారం అసెంబ్లీలో తీవ్ర దుమారానికి కారణమైంది. అమరావతిపై ప్రభుత్వ వైఖరిని టీడీపీ సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు. ఒకానొక దశలో సభను అడ్డుకున్నంత పనిచేశారు. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగేలా వ్యవహరించారంటూ స్పీకర్ ప్రతిపక్ష సభ్యులపై చర్యలకు సిద్ధమయ్యారు. సభ నుంచి తొమ్మిది మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కరోజు వారిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.