యాప్నగరం

Vijaya Sai Reddyపై రాష్ట్రపతికి ఫిర్యాదు

ఎంపీ విజయసాయిరెడ్డిపై రాష్ట్రపతికి బీజేపీ నేత ఫిర్యాదు. లాభదాయక పదవులో ఉన్నందున ఎంపీగా అనర్హత వేటు వేయాలని కోరారు. అలాగే ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయనున్నారు.

Samayam Telugu 10 Sep 2019, 9:01 pm
వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై బీజేపీ నేత రామకోటయ్య రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. విజయసాయిని ఎంపీగా అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. జయా బచ్చన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. విజయసాయికి ఇచ్చిన ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి.. లాభదాయక పదవుల కిందకు వస్తుందని భయపడి జీవోను రద్దు చేశారని.. దీనిపై ఈసీ కూడా స్పందించాలన్నారు. అలాగే జగన్‌పై కూడా రామకోటయ్య రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.
Samayam Telugu visa


Must Read: 'వైసీపీ గూండాల దాడుల్లో చేతులు, కాళ్లు విరిగినోళ్లు ఆర్టిస్టులా హోంమంత్రి గారు'

ఎంపీ విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ జీవో ఇచ్చి.. మళ్ళీ ఎందుకు రద్దు చేశారో చెప్పాలన్నారు రామకోటయ్య. విజయసాయి పదవి విషయంలో రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామని.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి ఆయన సభ్యత్వం రద్దు చేయాలని కోరుతామన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ లాభదాయక పదవుల విషయంలో గందరగోళంతో హడావుడిగా జీవోలు ఇచ్చి రద్దు చేయడం సరికాదన్నారు. ప్రజలు కళ్ళు మూసుకుని ఉన్నారని అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు.

ఇక ముఖ్యమంత్రి జగన్ 100 రోజుల పాలనలో ఎన్నో తప్పులు చేశారని మండిపడ్డారు బీజేపీ నేత. రాజధానిపై మంత్రుల వ్యాఖ్యలతో రాష్ట్రప్రజల్లో గందరగోళానికి కారణమయ్యిందని.. పోలవరం, పీపీఏల విషయంలోనూ అదే ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు కష్టాల్లో ఉన్నారని.. రాష్ట్రాన్ని పాలించమని ప్రజలు 151 సీట్లను ఇస్తే ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.