యాప్నగరం

జగనన్న కేంద్రం మెడలు వంచి సాయంత్రానికి హోదా తెస్తారు.. అనిత సెటైర్లు

'అన్నయ్య కేంద్రం మెడలు వంచి ఈ రోజు సాయంత్రానికి ప్రత్యేక హోదా తెస్తారని ఆశిస్తున్నాను. అసలే అన్నయ్య మాట తప్పడు, మడమ తిప్పడు' అంటూ సెటైర్లు

Samayam Telugu 6 Oct 2020, 12:04 pm
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చేశారు ఏపీ తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత. సీఎం ఢిల్లీ పర్యటనపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు పేల్చారు. ‘ఈ రెండూ సెపరేట్ వార్తలు...కేసుల విషయంలో అన్నయ్య భయపడి కలుస్తున్నారు అని నేను భావించటం లేదు. అన్నయ్య కేంద్రం మెడలు వంచి ఈ రోజు సాయంత్రానికి ప్రత్యేక హోదా తెస్తారని ఆశిస్తున్నాను. అసలే అన్నయ్య మాట తప్పడు, మడమ తిప్పడు అని ₹5/- బ్యాచ్ ఎలివేషన్స్ ఇవ్వటం మొదలుపెట్టారు’అంటూ ట్వీట్ చేశారు.
Samayam Telugu అనిత సెటైర్లు

అలాగే అమరావతి రైతులు పెయిడ్ ఆర్టిస్టులు అంటూ ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ‘డాక్టర్ గా, ఎమ్మెల్యే గా, మంత్రి గా ఉండి తెల్ల రేషన్ కార్డ్ మెయింటెన్ చేసే మీరు నిస్వార్థంగా కోట్ల రూపాయిల విలువ చేసే భూములను ఇచ్చిన అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్ట్స్ అనటం మీకు ఎలా ఉందో తెలీదు కానీ, మాకు చాలా అసహ్యంగా ఉంది’అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.