యాప్నగరం

పేరు చివర రెడ్డి ఉంటే అదో పెద్ద క్వాలిఫికేషన్.. రమేష్ కూడా బాధితులు: అనిత ఆసక్తికర వ్యాఖ్యలు

దళితులు అంటే రెడ్ల మోచేతి నీళ్లు తాగాలని మదం చూపుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేరు చివర రెడ్డి అని ఉంటే అదొక పెద్ద క్వాలిఫికేషన్ అనుకుంటున్నారు అంటూ ట్వీట్.

Samayam Telugu 17 Nov 2020, 11:08 am
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విరుచుకుపడ్డారు టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. రాష్ట్రంలో దళితుల్ని చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు.. ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. దళితులు అంటే రెడ్ల మోచేతి నీళ్లు తాగాలని మదం చూపుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారతీయులు ఎవరికి అయినా ఒక ప్రాథమిక హక్కు ఉంటుంది అది ఆత్మగౌరవంతో బ్రతకడమని.. పేరు చివర రెడ్డి అని ఉంటే అదొక పెద్ద క్వాలిఫికేషన్ అనుకుంటున్నారన్నారు. దళితుల మీద ఇన్ని అకృత్యాలు ఎప్పుడూ జరగలేదని.. రమేష్ గారు కూడా బాధితులు అయ్యారు అంటూ రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్‌ తన పదవి నుంచి తప్పుకోబోతున్నారనే విషయాన్ని ప్రస్తావించారు.
Samayam Telugu అనిత

టీడీపీ హయాంలో కట్టించిన ఇళ్ల విషయంలో జగన్ సర్కార్ తీరును అనిత తప్పుబట్టారు. ‘అమ్మకు జాకెట్ ముక్క పెట్టలేనోడు పిన్నమ్మకు చీర కొనిస్తా అన్నాడట.TDP హయాంలో కట్టిన ఇళ్ళు పేదలకు పంచటం చేతకాని పులకేసి, ఇళ్ల స్థలాలు ఇస్తాడట. 144 సెక్షన్ పెట్టటం దేనికి? గృహానిర్బంధాలు దేనికి? నోరు తెరిస్తే అబద్ధం,చిత్తశుద్ధి లేని చవటాయ్ ప్రగల్బాలు ప్రజలకు అర్దం అవుతున్నాయ్ CM గారు’ ఘాటుగా ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.