యాప్నగరం

YS Jagan ‌పై ఓ రేంజ్‌లో ట్రోలింగ్.. ‘ఏం భాష స్వామి అది’.. టీడీపీ అగ్రనేతలు రంగంలోకి!

YS Jaganmohan Reddy: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగు దేశం పార్టీ నేతలు ఓ రేంజ్‌లో ట్రోలింగ్‌కు దిగారు.

Samayam Telugu 1 Nov 2020, 4:53 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్మీట్ కోసం తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. సీఎం జగన్ ప్రెస్మీట్ కోసం.. రాజకీయ శత్రువులైన టీడీపీ శ్రేణులు ఎదురు చూడటం ఏంటని ఆలోచిస్తున్నారా? ఇందులోనే అసలు ట్విస్ట్ ఉంది. గతంలో తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైసీసీ శ్రేణులు వాడిన అస్త్రాన్నే సీఎం జగన్‌పై టీడీపీ నేతలు వాడుతున్నారు. అయితే లోకేష్‌ను వైసీపీ కార్యకర్తలు టార్గెట్ చేస్తే.. సీఎం జగన్ను మాత్రం ఏకంగా టీడీపీ అగ్రనేతలు ట్రోల్ చేస్తున్నారు. సీఎం జగన్ మాట్లాడిన తెలుగు తప్పులను వెతికి ఆయన్ను టార్గెట్ చేస్తున్నారు.
Samayam Telugu సీఎం జగన్‌పై ట్రోలింగ్


తాజాగా, ఆదివారం సీఎం జగన్ చేసిన ప్రసంగంలోని తెలుగు తప్పులను వెతికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. ‘ఏం భాష స్వామి అది!’ అంటూ వీడియో విడుదల చేశారు. అనంతరం టీడీపీ అగ్రనేతల నుంచి కార్యకర్తల వరకు ఓ రేంజ్‌లో సీఎం జగన్‌పై ట్రోలింగ్ చేపట్టారు. ఆ వీడియోలో ‘అక్కచమ్మలు, అక్క అంశం, సమర్భవించ వచ్చా, సమాస స్వేచ్ఛ’ అంటూ సీఎం జగన్ తెలుగు పదాలను తప్పుగా ఉచ్ఛరించారని ఎద్దేవా చేశారు.

టీడీపీ అగ్రనేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, గొల్లపల్లి సూర్యారావు, దీపక్ రెడ్డి, గాలి భానుప్రకాష్, మంతెన రామరాజు, ఎన్.అమర్‌నాథ్ రెడ్డి, గద్దె రామ్మోహన్, కె.జవహర్, బండారు సత్యనారాయణ మూర్తి, జీవీ ఆంజనేయులు, ఎంఎస్ రాజు, చింతమనేని ప్రభాకర్, బుద్దా వెంకన్న, పంచుమర్తి అనురాధ, బీటీ నాయుడు, కాల్వ శ్రీనివాసులు, బచ్చుల అర్జునుడు.. ఇతర టీడీపీ నేతలు ఒకే వీడియో, ఒకే కామెంట్‌తో ట్వీట్లు చేసి సీఎం జగన్‌పై ట్రోలింగ్‌కు దిగారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.