యాప్నగరం

చంద్రబాబు అలా.. అచ్చెన్నాయుడు ఇలా: పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు

కొద్దిరోజులుగా ఏపీలో పొత్తులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయమని అన్నారు. చంద్రబాబు కూడా ప్రభుత్వంపై పోరాటం చేయాలన్నారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు కూడా పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 20 May 2022, 8:41 pm

ప్రధానాంశాలు:

  • ఏపీలో పొత్తులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది
  • తాజాగా అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
  • వైఎస్ కూడా పొత్తులు పెట్టుకున్నారన్నారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu అచ్చెన్నాయుడు
పొత్తులపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి పొత్తులు కొత్త కాదు.. సీఎం జగన్ తండ్రి పొత్తులు పెట్టుకున్న విషయం బొత్ససత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావుకు తెలియదా అనిప్రశ్నించారు. పొత్తులతో టీడీపీకి పనిలేదు.. రాష్ట్రాన్ని, ప్రజల్ని రక్షించడమే టీడీపీ పని అన్నారు. ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తుల అంశాన్ని ప్రస్తావిస్తే.. అచ్చెన్నాయుడు మాత్రం పొత్తులతో టీడీపీకి పని లేదనడం ఆసక్తికరంగా మారింది.
మూడేళ్లలో ప్రజలపై ప్రభుత్వంచేసిన ఆకృత్యాలు, వారిపై వేసిన భారం అంతా ఇంతా కాదన్నారు అచ్చెన్న. బాదుడే, బాదుడు కార్యక్రమంతో టీడీపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి, ప్రజలకు వాస్తవాలు చెబుతుండటంతో వారిలో వ్యతిరేకత మొదలైందన్నారు. చంద్రబాబు పర్యటనతో వైఎస్సార్‌సీపీ కుర్చీలు కదిలాయని.. బాబు ఉత్తరాంధ్ర పర్యటనతో రాష్ట్రమే షేక్ అయ్యిందన్నారు. గతంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన కొత్తలో చైతన్య రథంపై తిరిగిన ప్రచారానికి వచ్చినప్పటి స్పందనే.. మళ్లీ ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటనలో కనిపించిందన్నారు.

చంద్రబాబు పర్యటన విజయవంతంతో, గడపగడపకు వైఎస్సార్‌సీపీని, గడప గడపకు ప్రభుత్వంగా మార్చారన్నారు. పథకాల పేరుతో ప్రజల్ని ఆకర్షించాలని చూస్తే, అది కుదరలేదన్నారు. ఎక్కడికక్కడ జనం వైఎస్సార్‌సీపీ వారి చొక్కాలు పట్టుకోవడం మొదలు పెట్టారని.. బలహీన వర్గాలను ఆకర్షించాలనే లక్ష్యంతో బస్సు యాత్ర అంటున్నారని విమర్శించారు. బలహీన వర్గాలను టీడీపీని విడదీయడం ఎవరి వల్లా కాదని.. టీడీపీనే బలహీనవర్గాలు.. బలహీనవర్గాలే టీడీపీ అన్నారు.

రాష్ట్రంలోని ఎస్సీ మంత్రులంతా ఆలోచించాలని.. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌తో ఈ ప్రభుత్వంలో ఎవరికైనా రూపాయి ఇచ్చారా అని ప్రశ్నించారు. బీసీలకు ఈ ముఖ్యమంత్రి ఏం చేశారో బీసీ మంత్రులు చెప్పగలరా అని ప్రశ్నించారు. మూడేళ్లలో బీసీలపై జరిగిన దాడులు, వారిపై పెట్టిన తప్పుడు కేసులు వారికి కనిపించలేదా అంటూ ప్రశ్నించారు. పేద బీసీ విద్యార్థుల కోసం తెచ్చిన విదేశీ విద్య తీసేశారని.. బస్సులో వెళ్లినా, రైళ్లల్లో వెళ్లినా ప్రజల ఛీత్కారమే మిగులుతుందని గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్సార్‌సీపీ వారికి చివరకు మిగిలేది విమానయాత్రే అని ఎద్దేవా చేశారు.

పొత్తులపై అంతక ముందు చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిన అవసరం ఉందని.. ప్రజా ఉద్యమము రావాలని వ్యాఖ్యానించారు. ఈ ఉద్యమానికి తెలుగుదేశం నాయకత్వం వహిస్తుందని.. అవసమైతే త్యాగాలు చేయడానికి సిద్ధం ఉండాలన్నారు. తర్వాత పొత్తులపై ఇప్పుడే నిర్ణయం తీసుకునే అవసరం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పొత్తులకు ఇంకా చాలా సమయం ఉందని.. పొత్తులు ఉన్నా.. లేకున్నా గెలుపోటములు ప్రజలు చేతుల్లో ఉంటాయన్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.