యాప్నగరం

నక్సలైట్లతో కలిసి వారిపై ప్రతీకారం తీర్చుకుంటా.. దళిత శిరోముండనం బాధితుడు సంచలనం

నక్సలైట్లలో చేరి ప్రతికారం తీర్చుకునేందుకు అనుమతివ్వాలంటూ శిరోముండనానికి గురైన దళిత యువకుడు రాష్ట్రపతికి లేఖ రాశారు.

Samayam Telugu 10 Aug 2020, 11:36 pm
శిరోముండనం చేసి తనను తీవ్ర అవమానానికి గురి చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు నక్సలైట్లలో కలిసిపోతానని బాధితుడు ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నక్సలైట్లలో కలిసిపోయేందుకు అనుమతి కోరుతూ సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. ఈ లేఖను రాష్ట్రపతి గ్రీవెన్స్ వెబ్‌సైట్‌లో సైతం అప్‌లోడ్ చేశారు.

తూర్పు గోదావరి జిల్లా సీతానగరానికి ప్రసాద్ దీనికి సంబంధించి ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో ప్రసాద్ మాట్లాడుతూ.. జూలై 18వ తేదీన మాజీ సర్పంచ్ తనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేసి శిరోముండనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు తనకు న్యాయం జరగలేదని బాధితుడు వరప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం కూడా తనకు అందలేదన్నారు.

దీనికి తోడు స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తనను వేధిస్తూ మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని ప్రసాద్ ఆరోపించాడు. ఈ వ్యవహారంపై తాను విసిగిపోయానని చెప్పారు. ఇక తనకు న్యాయం జరగదని భావిస్తున్నానని చెప్పారు. కాబట్టి తాను నక్సలైట్లలో కలిసిపోయి తనకు అన్యాయం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాడు. ప్రసాద్ పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.