యాప్నగరం

ఏపీ ప్రజలకు అలర్ట్: 3 రోజులు భారీ వర్షాలు.. ఆ ప్రాంత ప్రజలకు తీవ్ర హెచ్చరికలు!

ఆంధ్రప్రదేశ్‌లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని వల్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Samayam Telugu 11 Sep 2021, 11:38 pm
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించారు. తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని, అది వాయువ్య దిశగా పయనించి 48 గంటల్లో ఉత్తర ఒడిశా – పశ్చిమబెంగాల్ తీరం వెంబడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు వెల్లడించారు. దీని ప్రభావంతో రాబోయే 2 రోజుల పాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


బంగాళాఖాతంలో అల్పపీడనం ఫలితంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలో మీటర్ల వేగంతో తీవ్ర గాలులు వీస్తాయని కన్నబాబు తెలిపారు. దీని వల్ల సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులు ఆదివారం నుంచి మంగళవారం వరకు వేటకు వెళ్ళరాదని కన్నబాబు జాలర్లను హెచ్చరికలు జారీ చేశారు.

ఇక, రాబోయే 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో, అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ నెల 12, 13 తేదీల్లో ఉత్తర కోస్తా, ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని కన్నబాబు వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.