యాప్నగరం

ఆంధ్రాలో జోరు వర్షాలు: ఆ ప్రభావంతో 2 రోజులు ఇంతే.. ఈ ప్రాంతాల వారికి అలర్ట్!

ఏపీలో రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది.

Samayam Telugu 30 Jul 2021, 7:46 pm
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాబోయే 48 గంటల (2 రోజులు) పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలో ఏర్పడిన తీవ్ర అ‍ల్పపీడనం ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్‌కు సమీపంలో గ్యాంగ్‌టక్ వద్ద తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


దీనికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల ఎత్తున విస్తరించిందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 48 గంటల్లో పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్ వైపు అల్ప పీడనం కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే 48 గంటలు పాటు (రెండు రోజులు) తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే, ఒకటి రెండు చోట్లా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఇక, శుక్రవారం గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడనున్నాయి. ప్రస్తుతం రాజమండ్రిలో వర్షాలు పడుతున్నాయి. ఇవి కాసేపట్లో కాకినాడ వైపుగా వెల్లే అవకాశాలున్నాయి. అలాగే విజయవాడ, గుంటూరులో సైతం వర్షాలు పడుతున్నాయి. కొన్ని మేఘాలు తెలంగాణ నుంచి వస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.