యాప్నగరం

ఏపీ ప్రజలకు ‘చల్లని’ కబురు.. 3 రోజుల పాటు వర్షాలు!

ఏపీ ప్రజలకు వాతావరణ కేంద్రం ‘చల్లని’ కబురు చెప్పింది. రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Samayam Telugu 26 May 2020, 8:23 pm
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ కేంద్రం ‘చల్లని’ కబురు చెప్పింది. భానుడి భగభగలకు అల్లాడిపోతున్న ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే 24 గంటల్లో ఏపీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాలకు రాబోయే 24 గంటల్లో నైఋతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Samayam Telugu వర్షం


దక్షిణ చత్తీస్‌గఢ్ నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో మంగళవారం, బుధ, గురు వారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

అలాగే దక్షిణ కోస్తాంధ్రాలో మూడు రోజుల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సియస్‌ నుంచి 43 డిగ్రీ సెల్సియస్‌ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో ఈ మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సియస్‌ నుంచి 43 డిగ్రీ సెల్సియస్‌ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

please Vote: జగన్ ఏడాది పాలన ఎలా ఉంది ?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.