యాప్నగరం

నిప్పుల కుంపటిగా ఏపీ, ఆ 4 జిల్లాల్లో మరో 6 రోజులు ఇంతే..

ఏపీ నిప్పుల కుంపటిని తలపిస్తోంది. రాబోయే మరో 6 రోజుల పాటు ఈ ఎండలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 4 జిల్లాల్లో జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరించింది.

Samayam Telugu 22 May 2020, 1:34 pm
భానుడి భగభగలతో ఆంధ్రప్రదేశ్ నిప్పుల కుంపటిని తలపిస్తోంది. రాబోయే మరో ఆరు రోజుల పాటు ఈ ఎండలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని పేర్కొంది. కర్నూలు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరించింది. గురువారం గుంటూరు జిల్లా భట్టిప్రోలు, కృష్ణా జిల్లా పమిడిముక్కలలో గరిష్ఠంగా 47.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది.
Samayam Telugu మండుతున్న ఎండలు


ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 10 మండలాల్లో గురువారం 47 నుంచి 47.8 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో 75 మండలాల్లో వడగాలులు, 140 మండలాల్లో అధిక వేడి, 437 మండలాల్లో వేడి వాతావరణం నెలకొంది. ఈ నెల 28వ తేదీ వరకు ఎండలు కాస్తాయని.. తర్వాత వానలు కురుస్తాయని, తర్వాత మళ్లీ రాష్ట్రంలో వడగాలుల తీవ్రత పెరుగుతుందని పేర్కొంది.

శుక్రవారం నుంచి రాయలసీమలోనూ ఎండ ప్రభావం అధికంగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా వెల్లడించారు. ఈ నెల 28వ తేదీ వరకు వడగాలులు వీస్తాయని తెలిపారు. ఈ నెల 29 నుంచి పిడుగులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నైరుతి రుతుపవనాలు జూన్‌ 5వ తేదీ నాటికి కేరళను తాకి, కొన్ని రోజులకు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందన్నారు. వడగాలుల తీవ్రత పెరుగుతున్నందున జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.