యాప్నగరం

ఏపీ సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా మంత్రులు

Ys Jagan కు ఏపీ మంత్రులు రాఖీలు కట్టారు.. వారికి ముఖ్యమంత్రి రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అక్క చెల్లెమ్మలకు జగన్ రాఖీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 11 Aug 2022, 11:28 am

ప్రధానాంశాలు:

  • సీఎం క్యాంపు కార్యాలయంలో రాఖీ వేడుకలు
  • ముఖ్యమంత్రి జగన్‌కు రాఖీలు కట్టి నేతలు
  • అక్క, చెల్లెమ్మలకు సీఎం శుభాాకాంక్షలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ys Jagan
తాడేపల్లి ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో రాఖీ వేడుకలు జరిగాయి. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌‌రెడ్డికి మహిళా మంత్రులు రాఖీలు కట్టారు. మంత్రులు తానేటి వనిత, విడదల రజని, మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టిన వారిలో ఉన్నారు. రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు ట్విట్టర్ ద్వారా రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధనం అనేది ఆత్మీయతలు, అనురాగాల పండుగ అన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణపరంగా మహిళలకు మంచి చేసే విషయంలో దేశంలోనే ముందున్న మనందరి ప్రభుత్వానికి రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరి చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సులు కలకాలం లభించాలని కోరుకుంటున్నాను అన్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.