యాప్నగరం

చంద్రబాబులా సీఎం జగన్‌ను ముంచేది వాళ్లే.. పీసీసీ చీఫ్ ఆసక్తిక వ్యాఖ్యలు

టీడీపీ చీఫ్ చంద్రబాబు మాదిరిగా సీఎం జగన్‌ను ముంచేది వారేనని ఏపీసీసీ చీఫ్ సాకె శైలజానాథ్ వ్యాఖ్యానించారు.

Samayam Telugu 23 Jun 2020, 3:15 pm
తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును జన్మభూమి కమిటీలు ముంచినట్లు.. గ్రామ వలంటీర్లే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ముంచేస్తారని ఏపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సాకె శైలజానాథ్ జోస్యం చెప్పారు. జగన్ ప్రభుత్వంలో అసలు పరిపాలనే లేదని విమర్శించారు. అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు చేపట్టడం సరికాదని సీఎం జగన్‌కు హితవు పలికారు.
Samayam Telugu చంద్రబాబు, వైఎస్ జగన్


సీఎం జగన్‌కు అంత సమర్థత ఉంటే రాష్ట్ర ఆదాయం పెంచి ఇంటికి లక్ష రూపాయలు ఇవ్వాలని శైలజానాథ్ అన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కూడబెట్టిన ఆస్తులను జగన్ ప్రభుత్వం అమ్మేస్తోందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై చేతులెత్తేశాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలే ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలని విజ్ఞప్తి చేశారు.

చప్పట్లు కొట్టి, దీపాలు వెలిగిస్తే కరోనా పోతుందన్న బీజేపీ భక్తులు ఇప్పుడు ఏమయ్యారు అని శైలజానాథ్ ఎద్దేవా చేశారు. బీజేపీ, వైసీపీలు ఒక్కటేనని అభిప్రాయపడ్డారు. కాపుల రిజర్వేషన్ గురించి వైసీపీ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం పెట్రోలు ధరలు పెంచి జనాన్ని పిండుకుంటుందని మండిపడ్డారు. 2024లో కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.