యాప్నగరం

Pawan Kalyan ఇకనైనా ప్రభుత్వానికి సపోర్ట్ చేయ్.. లేదంటే జనం తరిమేస్తారు: రోజా

Janasena అధినేత పవన్ కళ్యాణ్‌పై వైఎస్ఆర్సీపీ నేతల విమర్శల దాడి కొనసాగుతోంది. ఎమ్మెల్యే రోజా పవన్‌పై విమర్శలు గుప్పించారు. ఐదేళ్ల బాబు పాలనపై పవన్ ఎందుకు పుస్తకాన్ని తీసుకురాలేదని ప్రశ్నించారు.

Samayam Telugu 15 Sep 2019, 12:56 pm
వైఎస్ఆర్సీపీ వంద రోజులపాలన పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివేదిక రూపొందించడం పట్ల అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. పవన్ తీరును తప్పుబడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ వ్యాఖ్యల్లో పసలేదని బొత్స ఎద్దేవా చేయగా.. ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా కూడా జనసేనానికి చురకలు అంటించారు. కాణిపాకం వినాయకుణ్ని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ.. టీడీపీ ఇచ్చే కంటెంట్‌ను మాట్లాడటం మానుకోవాలని పవన్ కళ్యాణ్‌కు సూచించారు.
Samayam Telugu pk roja


పెయిడ్ ఆర్టిసులతో ప్రభుత్వంపై బురద జల్లించిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు పవన్‌తో మాట్లాడిస్తున్నారని రోజా ఆరోపించారు. జగన్ వంద రోజుల పాలన గురించి పుస్తకం తెచ్చిన పవన్ కళ్యాణ్.. చంద్రబాబు 1700 రోజులు పాలిస్తే.. ఎందుకు పుస్తకాలు వేయలేదని రోజా ప్రశ్నించారు. జగన్ వంద రోజుల పాలనతో శభాష్ అనిపించుకున్నారన్న రోజా.. చంద్రబాబు ఎన్నో అవకతవకలకు పాల్పడితే, అవినీతికి పాల్పడితే ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.

ఇకనైనా ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని రోజా సూచించారు. లేకపోతే.. ప్రజలు ఏపీలో ఉండనీయకుండా మిమ్మల్ని తరిమేస్తారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీలు తీసుకొని పవన్ ఇంకా చంద్రబాబుకే పనిచేస్తున్నారని రోజా విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.