యాప్నగరం

నవయుగకు జగన్ సర్కార్ షాక్.. ఆ భూములు వెనక్కి

నవయుగ సంస్థకు షాకిచ్చిన జగన్ ప్రభుత్వం. కృష్ణపట్నంలో ఇచ్చిన భూముల్ని వెనక్కు తీసుకోోవాలని నిర్ణయం. ఎన్‌వోసీ తీసుకోకుండానే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు గుర్తింపు.

Samayam Telugu 21 Oct 2019, 2:51 pm
నవయుగ సంస్థకు జగన్ సర్కార్ మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. పోలవరం, బందరు పోర్టు తర్వాత కృష్ణపట్నంలో మరో ఝలక్ ఇచ్చింది. కృష్ణపట్నం ఇన్‌ఫ్రా సెజ్‌ కోసం కేటాయించిన భూముల్ని రద్దు చేసేందుకు సిద్ధమయ్యింది. ఈ భూముల్ని సొంత అవసరాలకు ఉపయోగించుకున్నారని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ భూముల్ని చూపించి బ్యాంకుల నుంచి నవయుగ సంస్థ రుణాలు తీసుకుంది. ఏపీఐఐసీ ఎన్‌వోసీ (అనుమతి పత్రం) తీసుకోకుండానే రుణం పొందినట్లు గుర్తించారు.
Samayam Telugu jagan


2009,2010లో నవయుగ సంస్థకు.. కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో 4వేల 732 ఎకరాలు భూమిని కేటాయించారు. అప్పుడు ఎకరం కేవలం రూ.1.15 లక్షలకే ఈ భూమిని ఏపీఐఐసీ విక్రయించింది. ఈ భూములతో నవయుగ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇలా రుణాలు తీసుకోవాలంటే.. కచ్చితంగా ఏపీఐఐసీ నుంచి అనుమతి (ఎన్‌వోసీ) తీసుకోవాలి. కానీ ఈ సంస్థ ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఆరోపణలు వచ్చాయి.

ఈ ఎన్‌వోసీ లేకుండానే నవయుగ సంస్థ బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకున్నారు. ఈ వ్యవహారం మొత్తం బయటపడటంతో నవయుగకు కేటాయించిన భూ కేటాయింపుల రద్దు చేశారు. సెజ్‌ అభివృద్ధి కోసం కాకుండా ఈ భూమని సొంత అవసరాలకు వినియోగించుకున్నట్లయ్యింది. అంతేకాదు సెజ్‌కు సంబంధించిన పనుల్ని కూడా నవయుగ సంస్థ ప్రారంభించలేదు.. ఏపీఐఐసీ నోటీసులు పంపినా సమాధానం లేదు.

సెజ్ పనులు ప్రారంభంకాకపోవడంతో గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది.. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్తగా అధికారలోకి వచ్చిన ప్రభుత్వం ఏపీఐఐసీ ఛైర్మన్‌ను నియమించింది. ఎమ్మెల్యే రోజా ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ వ్యవహారపై ఆరా తీశారు. నిబంధనలు ఉల్లఘించడం, పనులు మొదలు పెట్టకపోవడంతో నోటీసులు జారీ చేశారు. అప్పటికీ స్పందన రాకపోవడంతో భూ కేటాయింపులను రద్దు చేశారు. ఈ నవయుగ భూముల వ్యవహారంలో కూడా టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.