యాప్నగరం

ప్రశ్నాపత్రం లీకేజీలో ట్విస్ట్‌.. ఆ పరీక్షలతో మాకు సంబంధం లేదు: ఏపీపీఎస్సీ

ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన బోర్డు సమావేశంలో లీకేజీ వ్యవహారం చర్చకు వచ్చింది. ఈ సమీక్షకు కార్యదర్శి సహా సభ్యులు హాజరయ్యారు. సమావేశంలో పేపర్ లీక్‌పై సుదీర్ఘ చర్చ జరిగింది.

Samayam Telugu 24 Sep 2019, 9:22 am
ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షల ప్రశ్నాపత్రం లీకైందని వార్తలు వచ్చిన సంగతి తెలిసందే. ఏపీపీఎస్సీలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు టాప్ ర్యాంకులు వచ్చాయని, ప్రశ్నాపత్రం వారికి ముందే తెలుసన్న ఆరోపణలున్నాయి. అలాగే సర్వీస్ కమిషన్ ఉద్యోగుల ప్రమేయం కూడా ఉందని, పేపర్ లీకేజీ కారణంగానే వారి కుటుంబ సభ్యులకు టాప్ ర్యాంకులు వచ్చాయని ప్రచారం జరిగింది.
Samayam Telugu appsc


Must Read: విశాఖ జిల్లాలో కాల్పుల మోత.. నిన్న తప్పించుకున్న మావోలే టార్గెట్!

అయితే ఈ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. సచివాలయ పరీక్షలతో తమకు సంబంధం లేదని ఏపీపీఎస్సీ తేల్చిచెప్పింది. ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన బోర్డు సమావేశంలో లీకేజీ వ్యవహారం చర్చకు వచ్చింది. ఈ సమీక్షకు కార్యదర్శి సహా సభ్యులు హాజరయ్యారు. సమావేశంలో పేపర్ లీక్‌పై సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం చైర్మన్ ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియతో తమకు ఎలాంటి సంబధం లేదని స్పష్టం చేశారు. పరీక్షలు ప్రభుత్వమే నిర్వహించిందని, సంబంధిత శాఖలే స్పష్టత ఇవ్వాలన్నారు.

Also Read: రివర్స్‌ టెండరింగ్‌ ఓ డ్రామా.. తెరవెనుక వేరే కథ! దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు

పేపర్ లీకేజీ వ్యవహారం తమకు తెలియదని, పరీక్ష నిర్వహించిన పంచాయతీరాజ్ శాఖ అధికారులే వివరణ ఇవ్వాలని ఉదయ్ భాస్కర్ పేర్కొనడం గమనార్హం. సచివాలయ పరీక్షలకు సంబంధించిన గోప్యంగా నిర్వహించాల్సిన పనులను సంబంధిత ప్రభుత్వ శాఖలే చేశాయని చెప్పారు. ఏపీపీఎస్సీలోనే అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అసలు ఆ పరీక్షలతో సంబంధం లేదని ఏపీపీఎస్సీ చెబుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.