ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలర్ట్. వచ్చే నాలుగు రోజుల పాటు ఎండలు దంచికొడతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ బీఆర్ అంబేద్కర్ అన్నారు. శనివారం వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాం తాల్లో 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరికొంత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఏప్రిల్ 23 నుంచి 26 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు జిల్లాల్లో మండలాలవారీగా చూస్తే.. పార్వతీపురం మన్యం 12, విజయనగరం 9, అనకాపల్లి 8, అల్లూరి సీతారామరాజు 6, కాకినాడ 3 మిగిలిన చోట్ల అక్కడక్కడ మొత్తం 41 మండలాల్లో వడగాల్పులు ఎక్కువగా ఉంటాయంటున్నారు. ఆదివారం ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు కొంచెం అటూ ఇటుగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.
ఏప్రిల్ 26 వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండటం మంచిదన్నారు. ముందు జాగ్రత్తగా డీహైడ్రేట్ కాకుండా ఓఆర్ఎస్, నిమ్మకాయ నీరు, లస్సీ, మజ్జిగ, కొబ్బరినీరు తాగాలని సూచనలు చేశారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.
మరోవైపు తెలంగాణలో మాత్రం విచిత్ర వాతావరణం ఉంది. గురు, శుక్రవారాల్లో హైదరాబాద్తో పాటూ కొన్ని జిల్లాల్లో వానలు కురిశాయి. ఈదురుగాలులతో కూడిన భారీగా వర్షాలు పడ్డాయి. ఉదయమంతా ఎండ దంచికొడుతుండగా.. సాయంత్రానికి మాత్రం వాతావరణం పూర్తిగా మారిపోతోంది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అలాగే ఏపీలోని కొన్ని జిల్లాల్లో వాతావరణం మారింది, అక్కడక్కడా చిరు జల్లులు పలకరించాయి.. కానీ శనివారం నుంచి ఎండలు మండిపోతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఏప్రిల్ 26 వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండటం మంచిదన్నారు. ముందు జాగ్రత్తగా డీహైడ్రేట్ కాకుండా ఓఆర్ఎస్, నిమ్మకాయ నీరు, లస్సీ, మజ్జిగ, కొబ్బరినీరు తాగాలని సూచనలు చేశారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.
మరోవైపు తెలంగాణలో మాత్రం విచిత్ర వాతావరణం ఉంది. గురు, శుక్రవారాల్లో హైదరాబాద్తో పాటూ కొన్ని జిల్లాల్లో వానలు కురిశాయి. ఈదురుగాలులతో కూడిన భారీగా వర్షాలు పడ్డాయి. ఉదయమంతా ఎండ దంచికొడుతుండగా.. సాయంత్రానికి మాత్రం వాతావరణం పూర్తిగా మారిపోతోంది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అలాగే ఏపీలోని కొన్ని జిల్లాల్లో వాతావరణం మారింది, అక్కడక్కడా చిరు జల్లులు పలకరించాయి.. కానీ శనివారం నుంచి ఎండలు మండిపోతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.